మూత్ర సంబంధ వ్యాధులకు
ఎరుపు, తెలుపు, పసుపు శెగలకు
ఇది ఇతరులు మూత్రం పోసిన చోట మరొకరు మూత్రంపోయడంవల్లగానీ, లేక సెగరోగమున్న వారితో సంభోగం జరపడంవల్లగానీ ఈ సుఖరోగం కలుగుతుంది.
ఆ సమస్యకు అత్తపత్తిఆకు, మంచిగంధంపొడి సమంగా తీసుకొని కలబందగుజ్జుతో మెత్తగానూరి మాత్రలుకట్టి నీడలో గాలికి బాగాఎండబెట్టి నిలువ వుంచుకోవాలి. రోజూ రెండుపూటలా పూటకు ఒకమాత్ర మంచినీటితో వేసుకొంటూవుంటే సెగ రోగం తగ్గిపోవడమేకాక వీర్యవృద్ధి కలుగుతుంది.
అతిమూత్రమునకు అత్తపత్తి
పచ్చనిపూలుపూసే అత్తపత్తిచెట్టుకాడలను, తాటి కలకండను సమంగా కలిపి మెత్తగానూరి కుంకుడు గింజలంత మాత్రలుచేసి గాలిలో నీడకు బాగా ఆరబెట్టి రెండుపూటలా మర్రిచెక్క కషాయంతో ఒక మాత్ర సేవిస్తూవుంటే అతిమూత్రం హరిస్తుంది.
మూత్రంలో మంట - తగ్గుటకు
బాగా మెత్తగావున్న పసుపుపచ్చని చిన్న అరటి పండు తింటూవుంటే మూత్రంలో మంట తగ్గడమేకాక ఆమాశయం కూడా పరిశుభ్రమౌతుంది.
మూత్రం ఆగితే ? - రప్పించడానికి
అరటిదుంపను మెత్తగా తొక్కి పొత్తికడుపు పైనవేసి బట్టతో కట్టుకడితే మూత్రం అతిత్వరగా సహజంగా బయటకు వస్తుంది.
అతివేడి - అతిపైత్యం
అరటిచెట్టు వేరును మెత్తగానూరి రసంతీసి రెండు మూడుచెంచాల రసం ఒకకప్పు నీటిలోకలిపి తాగుతూ వుంటే అతివేడి, అతి పైత్యం రెండుమూడురోజుల్లో తగ్గిపోతుంది.
బిగించిన మూత్రం - వెంటనే వచ్చుటకు
అశ్వగంధ, తిప్పతీగ, శొంఠి, ఉసిరికకాయల బెరడు, ఏనుగుపల్లేరుకాయలు వీటిని సమానంగా పొడులుచేసి కలిపి నిలువవుంచుకోవాలి. రెండు గ్లాసుల మంచినీటిలో 20గ్రా॥ పొడివేసి అరగ్లాసు కషాయానికి మరిగించి చల్లార్చి ఒకచెంచా తేనెకలిపి తాగితే వెంటనే మూత్రబంధం, మూత్రంలో మంట తగ్గిపోయి సాఫీగా మూత్రం బయటికి వస్తుంది.
మూత్రపిండాల - పరిరక్షణకు
అవిసెగింజల్ని దోరగావేయించి వాటిలో సగం తూకంగా కండచక్కెరపొడి కలిపి రోటిలోవేసి బాగా మెత్తగా అయ్యేంతవరకు దంచాలి. తరువాత ఆముద్దను 10గ్రా॥ల మోతాదుగా లడ్లులాగా తయా రుచేసి నిలువవుంచుకోవాలి.
మూత్రపిండాలు పాడైనవారు అనేక మూత్ర వ్యాధులతో బాధపడే వారు ఉదయం సాయంత్రం ఆహారానికి గంటముందు ఒక అవిసెలడ్డును తింటూవుంటే అతిత్వరగా ఆసమస్యలన్నీ తీరిపోతాయ్.