స్త్రీల యోని బిగువుకు
అత్తపత్తిఆకును తేనెతో మెత్తగానూరి యోనికి పట్టిస్తూవుంటే యోని బిగువుగా మారుతుంది.
* తీపిపదార్థాలు సేవించాలి.
స్త్రీల స్తనాల బిగువుకు
అత్తపత్తి సమూలచూర్ణం, అశ్వగంధ దుంపల చూర్ణం, సమంగా కలిపి పుంచుకొని రాత్రిపూట తగినంతపొడిని నీటితోనూరి స్తనాలపైన పట్టించి ఉదయం కడుగుతువుంటే జారిన స్తనాలు బిగువుగా మారతయ్. పాలు, నెయ్యి, పండ్లు, తీపి తినాలి.
ఆగిన బహిష్టు - మరలా వచ్చుటకు
అత్తపత్తిఆకుపొడి ఒకభాగము, పటికబెల్లం పొడి రెండుభాగాలు కలిపి పూటకు అరచెంచాపొడి మంచినీటితో సేవిస్తూవుంటే ఆగినబహిష్టు మరలా వస్తుంది. రాగానే చూర్ణం వాడటం ఆపాలి.
* బెల్లం, నువ్వులు, గంజి, తీపిపదార్థాలు వాడాలి.
స్త్రీ ప్రాణాలు హరించే- సోమరోగానికి
స్త్రీలలో గర్భాశయరోగాలు ముదిరిపోయి చివరికి సోమరోగంగా మారి యోనిగుండా తెల్లని నీరు నిరంతరం స్రవిస్తూవుంటుంది. దీనిని వెంటనే ఆపక పోతే ధాతువులు శోషించి ప్రాణాలకే ప్రమాదం.
పచ్చిఉసిరిక కాయలరసంలోగానీ, ఉసిరిక కాయ లతో కాచిన కషాయంలోగానీ, అరటిపండ్లను కలిపి కొంచెంతేనె, పటికబెల్లం కూడా చేర్చి రెండుపూటలా సేవిస్తూవుంటే స్త్రీల సోమరోగం హరించిపోతుంది.
స్త్రీల - అతిఋతురక్త స్రావానికి
బాగామగ్గిన అరటిపండుఒకటి నాటు ఆవునెయ్యి లేదా నాటు గేదెనెయ్యి 50 గ్రా॥ కలిపి తినాలి. ఇలా రోజుకు మూడుపూటలా మూడుసార్లు తింటూవుంటే బహిష్టులో ఆగకుండా ప్రవాహంలాగా స్రవించే అతి ఋతువు ఆగిపోతుంది.
యోని జారే - యోనికందరోగానికి
పచ్చి అరటికాయలను ముక్కలుగా తరిగి ఎండబెట్టి దంచి జల్లించి నిలువ వుంచుకోవాలి. వివిధ కారణాలవల్ల కొందరు స్త్రీలకుయోని బయటకు జారిపోతుంది. అలాంటివారు ఈ చూర్ణాన్ని పూటకు మూడునుండి అయిదు గ్రాముల మోతాదుగా మంచి నీటితో రెండుపూటలా సేవిస్తూవుంటే యోనికంద రోగం హరించిపోతుంది.
స్త్రీలు - సుఖంగా ప్రసవించుటకు
అరటిచెట్టువేరును స్త్రీ నడుముకు కట్టివుంచితే అతిసులువుగా కష్టంలేకుండా ఆస్త్రీ వెంటనే ప్రస విస్తుంది.
ఆగిన బహిష్టు - మరలా వచ్చుటకు
అరటిఊచరసం పరగడుపున అరకప్పు మోతా దుగా సేవిస్తుంటే ఆగిపోయిన బహిష్టు మరలా వస్తుంది.
యోనిబిగువుకు - పెన్నేరుదుంప
అశ్వగంధగడ్డను మంచినీటితో సానరాయిపైన అరగదీసి ఆగంధాన్ని స్త్రీలు యోనికి లేపనం చేసు కొంటూవుంటే యోని బిగువుగా మారుతుంది
బహిష్టును క్రమపరిచే - అశ్వగంధ
అశ్వగంధపొడి 5గ్రా॥, పటికబెల్లంపొడి 5గ్రా॥ కలిపి రోజూ ఉదయం మంచినీటితో సేవిస్తుంటే అతిగా స్రవించే ఋతురక్తం ఆగిపోయి, తగిన ప్రమాణంలోనే విడుదలౌతుంది.
సిగ్గువిడిచిన - స్త్రీ పురుషులకు
సూర్యగ్రహణము లేక చంద్రగ్రహణము రోజున అత్తపత్తికి ధూపదీప నైవేద్యాలతో పూజించి వేరుతెచ్చి కడిగి ఆరబెట్టి దాన్ని రాగి తాయెత్తులో పెట్టి మొలకు గానీ, చేతికిగానీ కట్టివుంచితే అంతకుముందువరకు
సిగ్గులేకుండా బరితెగించి ప్రవర్తించే స్త్రీ పురుషులు క్రమంగా తమతప్పును తామే తెలుసుకొని సిగ్గుపడ తారు. * చేపలు, మాంసం, మత్తుపదార్థాలు నిషేధం.