మూతివంకరపోయే-ముఖపక్షవాతం

అక్కలకర్ర, నేలతాడి దుంపలు, బూరుగువేర్లు, లవంగాలు, దాల్చినచెక్క చలువ మిరియాలు, పిప్పళ్ళు, అశ్వగంధ గడ్డలు, జాజికాయలు, బాదం పప్పు, పిస్తాపప్పు, గసగసాలు, జాపత్రి, నల్ల జీలకర్ర వీటిని ఒక్కొక్కటి పదిగ్రాముల మోతాదుగా తీసుకొని తగి నంత తేనెతోకలిపి మెత్తగా ముద్దలాగా నూరాలి.

ఆ ముద్దను రేగిపండంత గోలీలుగాచేసి ఆరబెట్టి నిలువవుంచుకోవాలి.

రోజూ పూటకు ఒకమాత్ర చొప్పున రెండు పూటలా తేనెకలిపిన నీటితో సేవిస్తువుండాలి. ఇలా చేస్తుంటే కొద్దిరోజుల్లోనే మూతివంకర తగ్గి ముఖం సక్రమంగా వస్తుంది.



కంఠరోగాలు - దంతరోగాలు

అక్కలకర్ర, దుంపరాష్ట్రం, సొంఠి ఒక్కొక్కటి ఒక్క గ్రాముచొప్పున ఒక గ్లాసునీటిలోవేసి ఒక కప్పు కషాయం మిగిలేవరకు చిన్నమంటపైన మరిగించి దించి వడపోసి గోరువెచ్చగా నోటిలో పోసుకొని గొంతువరకు తగిలేటట్లు అయిదు నిమిషాలపాటు పుక్కిలించి వూసివేస్తుంటే కంఠరోగాలు, దంత రోగాలు మాటుమాయమై పోతయ్



నత్తి తగ్గుటకు - అక్కలకర్ర

రోజూ అక్కలకర్రవేరు ముక్కను కొద్దిగా గంధం తీసి నాలుక పైన కొద్దిగా మాత్రమే రాస్తుంటే నత్తి తగ్గిపోతుంది. ఎక్కువరాస్తే పుండుపడుతుంది జాగ్రత్త.


గవదబిళ్ళలకు -గట్టియోగం

ఆవిశాకు, కొద్దిగా గుల్లసున్నం కలిపినూరి పైన పట్టించి దూది అంటిస్తూవుంటే గవదబిళ్ళలు తగ్గి పోతయ్. లేక ఒట్టి ఆకురసమైనా పైనపూస్తుంటే ఆ బిళ్ళలు కరిగిపోతయ్.


కంటిరోగాలకు - కమ్మనిమార్గం

అవిశాకునుకడిగి చేతితో నలిపి రసంతీసి వడపోసి ఒకచుక్క కంటిలోవేసుకుంటుంటే కంటి మసకలు తగ్గిపోయి చూపు నిర్మలమౌతుంది, రేచీకటికూడా తగ్గిపోతుంది.

రేచీకటి తగ్గిపోవుటకు

ప్రతిరోజూ అవిసెపూలనుగానీ, మొగ్గలనుగానీ కూరగా వండుకొని అన్నంలోకలుపుకొనివరుసగా 21రోజలు తింటుంటే రేచీకటిరోగం హరించి పోతుంది.


పార్శ్వపు తలనొప్పి -పారిపోవుటకు

అవిసెగింజలు 5గ్రా॥, ఆవాలు 5గ్రా॥ కలిపి మంచినీటితో మెత్తగానూరి ఆమిశ్రమాన్ని తల కణతలపైన మాత్రమే పట్టులాగావేసి పైనకాగితం అంటించాలి. తరువాత, ఇటుకపోడిని వేయించి బట్టలో మూటకట్టి దానితో కాపడం పెడుతూవుంటే అప్పటికప్పుడే పార్శ్వపునొప్పి తగ్గిపోతుంది.




✍🏻 . . . రామ్ కర్రి జ్ఞానాన్వేషి 🧠, ధర్మ రక్షక్ 📿, నవ యువ కవి 📖, రచయిత ✒️, బ్లాగర్ 🪩 ,. టెక్ గురు 🖥️ , సామాజిక కార్యకర్త 🩸 , 📖 తెలుగు భాషా సంరక్షణ వేదిక 📚 , 🪷 సంజీవని ఔషధ వన ఆశ్రమం 🌱 , మరియు 🛕 జ్ఞాన కేంద్ర 🚩 వ్యవస్థాపకులు . . . www.ramkarri.org 8096339900