జగమొండి-శిరోరోగములకు
అక్కలకర్ర, మిరియాలు, సొంటి ఒక్కొక్కటి 5 గ్రాముల మోతాదుగా తీసుకొని మంచినీటితో మెత్తగానూరి తలకుపట్టువేస్తుంటే దీర్ఘకాలికమైన తలనొప్పులు తగ్గిపోతయ్.
అడ్డసరంతో - అందాలవెంట్రుకలు
అడ్డసరం ఆకులు దంచి తీసినరసం రెండు కేజీలు, త్రిఫలాలు దంచితీసినరసం అరకేజీ, నువ్వుల నూనె రెండుకేజీలు కలిపి చిన్నమంట పైన పదార్థాలన్నీ ఇగిరిపోయి నూనె మిగిలేవరకు మరిగించాలి.
తరువాత దించి చల్లార్చి గాజుసీసాలో నిలువ చేసుకోవాలి.
ఈతైలాన్ని రోజూ తలకు రాసుకుంటూవుంటే మెదడుకు బలం కలగడమేకాక తలలోని చుండ్రు, పుండ్లు, గుల్లలు, దురదలు తగ్గిపోయి క్రమంగా తెల్ల వెంట్రుకలన్నీ నల్లబడతయ్.
వళ్ళంతా మంటలు, పోట్లు, తాపం ఉంటే
అశ్వగంధ, త్రిఫలచూర్ణం, అతిమధురం, పల్లేరు పొడి, శతావరిపొడి, పసుపు, మానిపసుపు, వీటిని సమంగా తీసుకొని ఈ మొత్తం ఎంతతూకముంటే అంత కొండపిండివేర్లపొడి కలిపి ఆమొత్తం ఎంత వుంటే అంత పటికబెల్లంపొడి కలిపి నిలువవుంచు కోవాలి. పూటకు 5గ్రా॥ మోతాదుగా రెండుపూటలా మంచినీటితో సేవిస్తుంటే పైసమస్యలు తగ్గిపోతయ్.
దురదలను - దుమ్ముదులిపే యోగం
అడ్డసరపాకు, పసుపు సమంగా తీసుకొని తగి నంత గోమూత్రంతో మెత్తగానూరి దురదలపైన పట్టించి అది బాగా ఆరిపోయిన తరువాత గోరు వెచ్చని నీటితో స్నానంచేస్తుంటే దురదలు, దద్దుర్లు ఖచ్చితంగా తగ్గిపోతయ్.
అన్నిరకాల దగ్గులకు - అడ్డసరం
అడ్డసరపాకులరసం 5గ్రా॥, తులశాకురసం 5గ్రా॥, తేనె 5 గ్రా॥ కలిపి రెండుపూటలా సేవిస్తుంటే ఏ రకమైన దగ్గుఅయినా ఎగిరిపోతుంది.
శరీరానికి తెల్లనికాంతి,అతిసౌందర్యప్రాప్తి
అవిసెపూలు తెచ్చి ఆరబెట్టి దంచిజల్లించి నిలువ చేసుకోవాలి. రోజూ తగినంత పొడిని గేదె పాలతో కలిపి మెత్తగానూరి అందులో కొంచెం వెన్న కూడా కలిపి ఈమిశ్రమాన్ని శరీరానికి నలుగుపిండిలాగా మర్దనచేసి ఎండిపోయిన తరువాత స్నానంచేస్తుంటే శరీరంలోని నలుపంతా విరిగిపోయి చర్మమంతా తెల్లగా సౌందర్యవంతంగా తయారౌతుంది.
ముగ్ధమోహన-సౌందర్య ప్రాప్తి
సీమఅవిసెగింజలు, మినపప్పు, గోధుమలు, దోరగా వేయించిన పిప్పళ్ళపొడి సమభాగాలుగా కలిపి నిలువవుంచుకోవాలి. రోజూ స్నానానికి గంటముందు తగినంత పొడిని మంచినెయ్యితో బాగాకలిపి అముద్దను శరీరమంతారుద్దుకొని అది బాగా ఆరి పోయిన తరువాత స్నానంచేస్తుంటే మన్మధునివంటి శరీరకాంతి చేకూరుతుంది.