ఒక సన్యాసి నదిలో స్నానం చేస్తున్నాడు. తేలోకటి నదిలో కొట్టుకుపోతున్నది. సన్యాసి దాని వంక చూసాడు. దాన్ని రక్షించదలచి చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే అది అతన్ని కుట్టింది. కంగారుతో అతను నీటి లో జారవిడిచాడు.
అయ్యో చచ్చిపోతుందేమో అనిపించింది. మరల దానిని రక్షించాలని బుద్ధి పుట్టింది. చేతిలోకి తీసుకున్నాడు. మళ్లీ అది అతనిని కుట్టింది. తిరిగి అది నీటిలో జారిపోయింది
 ఎలాగైనా రక్షించాలనుకొని మూడవమారు చేతిలోకి తీసుకుని గట్టు మీదకు విసిరి వేసాడు. అది జరా జరా నేలమీదికి పాకుతూ పోయింది.
ఇదంతా చూస్తున్న యువకుడొకడు వచ్చి ఆసన్యాసిని ఇలా అడిగాడు, ”అయ్యా! అది విష పురుగు అని తెలుస్తూనే ఉంది కదా,అది మిమ్మల్ని రెండు సార్లు కుట్టింది. దాన్ని ఎందుకు రక్షించారు ?”.....
అందుకు ఆ సన్యాసి, మాట్లాడుతూ ”ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా తేలు తన స్వభావాన్ని వదలకుండా కుడుతున్నదే, అలాంటప్పుడు సన్యాసి అయిన నేను పరోపకారం చేయడం అనే నా స్వభావాన్ని నేనెందుకు వదులుకోవాలి ?” అని సమాధానమిచ్చాడు.
పరిస్థితుల ప్రభావం వలన, వత్తిడులవలన, ఇబ్బందుల వలన వ్యక్తి తన సహజమైన గుణాలను కోల్పోకూడదు.👍