స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు...
పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది..కానీ ఎందుచేతో జన బాహుళ్యంలో లేదీపద్యం.

పద్యం:
కార్యేషు యోగీ, కరణేషు దక్షః

రూపేచ కృష్ణః-క్షమయా తు రామః

భోజ్యేషు తృప్తః  సుఖదుఃఖ మిత్రం

షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)

భావము:
--> కార్యేషు యోగీ :
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించ కుండా చెయ్యాలి.

--> కరణేషు దక్షః
కుటుంబాన్ని నడప డంలో, కార్యాలను నిర్వహించడంలో  నేర్పుతో, సంయమ నంతో వ్యవహరిం చాలి. సమర్ధుడై ఉండాలి.


--> రూపేచ కృష్ణః
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే  ఎల్ల ప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.

--> క్షమయా తు రామః
ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్య పరిపాలకుడైనరాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.

--> భోజ్యేషు తృప్తః
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.

--> సుఖదుఃఖ మిత్రం
 సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.

ఈ షట్కర్మలు సక్రమం గా చేసే పురుషుడు ఉత్తమ  పురుషునిగా , ధర్మనాథునిగా కొని యాడబడతాడు.