తంత్రాలు : దృఢ సంకల్పంతో ఈ తంత్రాలను అనుకరించండి  తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు... 


ఇవి నా సేకరణ మాత్రమే గమనించగలరు...






◆ నాలుగు చిన్న మేకులు తీసుకుని నృసింహ మంత్రాన్ని చెబుతూ మీ సింహ ద్వారానికి ఇరుప్రక్కలా దించేయండి. 
ఎలాంటి దుష్టాత్మలు ఇంట్లోకి ప్రవేశించవు.

◆ ఇంట్లోకి వచ్చే ముందు ద్వారానికి ఎదురుగా చెప్పులు విడవకండి.

◆ మీ పిల్లలు మాట వినడం లేదా?ఆదివారం అష్టాక్షారీ మంత్రంతో వారిపై నుండి ఒక బూరు కొబ్బరి కాయను తిప్పి కూడలిలో పారవేయండి.

◆ ఇంట్లో డబ్బు నిలవకుంటే నాలుగు గచ్ఛకాయలు లక్ష్మి మంత్రాన్ని నూట ఎనిమిదిసార్లు చేసి బీరువాలో పెట్టండి.

◆ ఎప్పుడూ ఏదో సమస్యతో బాధపడేవారు భైరవుని పేరుమీద కొంచెం మద్యాన్ని తీసుకొని భైరవాష్టకాన్ని చదివి తాగేవారికి ఇవ్వండి.


◆ తాంబూలంలో కొద్దిగా జాజికాయను కలిపి వేసుకోవడం ద్వారా ముఖంలో చక్కని వర్చస్సుని పొందగలరు.

◆ కొన్ని తెల్ల ఆవాలు తీసుకొని భైరవమంత్రం చదువుతూ మీ యింటికి ఎనిమిది పక్కలా చల్లండి, భైరవుడు మీకు రక్షణ గా ఉంటాడు,

◆ కొద్దిగా పాతబెల్లం తీసుకొని ముద్దలా చేసి పదకొండు లవంగాలు గుచ్చి నైఋతిలో పాతి పెట్టండి.ఇంటికి పీడలు తొలగిపోతాయి.

◆ శుక్ర వారం రాహుకాలంలో రెండు రొట్టెలు వాటిలో కొద్దిగా బెల్లం కలిపి ఆవుకి తినిపించండి.రాహుగ్రహ దోషాలనుండి విముక్తి లభిస్తుంది.

◆ గణపతి ప్రీతి కొరకు మీకు వీలయినపుడల్లా పిల్లలకు తీపి పదార్థాలు పంచండి.

◆ బ్యాంకు లో డబ్బులు వేసేముందు ఏదైనా లక్ష్మీ మంత్రాన్ని జపించండి,

◆ మీరు ఏరకమైన పొదుపు చేయాలనుకుంటే భరణీ నక్షత్రం లో చేయండి

◆ ఆర్థికంగా అర్థం కాని స్థితి ఏర్పడిన సుందరాకాండ పారాయణం చేయండి.

◆ శంకపుష్పి వేరుని గురుపుష్యమి రోజు తెచ్చి పూజించి శ్రీ సూక్తం చదివి మీరు డబ్బు లు పెట్టేచోట ఉంచండి.

◆ మీరు చేసే ఏదైనా హోమంలో కమలా భీజాలు, నల్లనువ్వులు ఇప్పనూనె, ఆవునెయ్యి వేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది .


◆ ఋణవిముక్తి కొరకు  108 మందార ఆకులు తీసుకొని శుభ్రంగా తుడిచి వాటిపై ఓంకారాన్ని అష్టగంధం తో దానిమ్మ పుల్లతో వ్రాసి గణపతికి సింధూరం పెట్టి ఆకులు అతికించి గణపతి ని శ్రీ గణేశ ఋణం చింది చింది మంత్రంతో పూజించండి 5 మంగళవారాలు.

◆ మంగళవారం ఎర్రపప్పుతో శివలింగం పై పెట్టి ఓం ఋణముక్తేశ్వరాయ నమః చెబుతూ పూజించండి.

◆ ఎర్ర గుడ్డలో కొన్ని బియ్యం కట్టి వంటగదిలో పెట్టి అక్కడ ఒక స్వస్తిక్ వేసిఉంచడంవల్ల ధన ఆవాహనం జరుగుతుంది.

◆ నెమలి ఫించాన్ని తీసుకొని 21 రోజులు లక్మీ  మంత్రాన్ని చదివి పూజించి సింహద్వారం పై లేదా బీరువాలో పెట్టండి ,ధనం రావడం జరుగుతుంది.

◆ మీకు ఎంతకూ పరిస్థితి సరిగ్గా లేనపుడు ఏదైనా రావి చెట్టు లేదా మర్రి చెట్టు వద్దకు వెళ్ళి ఎర్రటి దారాన్ని చెట్టుకి కట్టి రండి, అగరువత్తులు వెలిగించి సంకల్పం చెప్పండి, పరిస్థితి చక్కబడ్డాక వెళ్ళి దారాన్ని విప్పేయండి.

◆ మీకు ఎంతకూ పనులు కానపుడు మీకు పెళ్ళి కానపుడు మీకు  సంభందించచిన గుడ్డలు ఇంట్లో ఉంటే వెంటనే tailor కు పట్టేయండి.

◆ ఇద్దరు ప్రేమికుల మధ్య ఎడబాటు లేదా భార్యభర్తల మధ్య ఎడబాటు వస్తే వెంటనే పిల్లలకు స్వీట్లు పంచండి.

◆ మీ పరిస్థితులలో గొప్ప మార్పు సంభవించాలంటే ముందుగా మీ సంపాదనలోంచి మీ గురువుగారికి పదిశాతం సమర్పించండి.

◆ మీ బంగారం ఎప్పుడూ తాకట్టులో ఉంటుందా? అయితే పిసరంత బంగారాన్ని పుట్టలో వేసి పూజించండి.


◆ ఎవరైనా మీకు తెలియకుండా ఇబ్బంది పెట్టినపుడు లేదా మీ వ్యాపారాన్ని నడవకుండా ఏదైనా ప్రయోగం జరిగితే కొన్ని తెల్ల ఆవాలు తీసుకొని లక్ష్మీ నృసింహ మంత్రాన్ని చదువుతూ మీ వ్యాపార స్థలంలో భయటా చల్లండి.

◆ భార్యా భర్తల మధ్య గొడవ విడిపోయే వరకు వస్తే స్త్రీలు మంగళగౌరీ వ్రతాన్ని చేయండి.

◆ చిన్నపిల్లలు రాత్రిళ్ళు జడుసుకుంటుంటే తలగడ వైపు ఒక నిమ్మకాయ ఉంచండి.

◆ పిల్లలు ప్రతీదానికి భయపడుతుంటే ఒక గోమతి చక్రాన్ని వెండి లాకెట్ చేయించి మెడలో వేయండి.

◆ వ్యాపారంలో భాగస్తుల సఖ్యత కొరకు వ్యాపారానికి సంభంధించిన forms కి కొంచెం సింధూరాన్ని పెట్టండి.

◆ తరచూ గర్భస్రావం జరుగుతూ ఉంటే అనాథ పిల్లలకు మీకు తోచిన సహాయం చేస్తూ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి,మీ జాతకరీత్యా లగ్నం నుండి ఐదవ స్థానంలో దోషముంటే దోషపరిహారము  చేయించండి,

◆ మీ వంశలో ఎవరైనా మానసిక వికలాంగులు లేదా ఇంటి ఆడపడుచు విధవగా మారి మీ ఇంట్లోనే ఉందంటే నాగశాపం కారణం కావచ్చు.వెంటనే కుటుంతో సహా సర్పశాంతి చేయించండి.

◆ మీ వ్యాపారంలో ఉన్నతస్థాయినుండి ఒకేసారి క్రింది స్థాయికి పడిపోయి ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉంటే సర్పదోష నివారణ చేయించండి, కాలం సహకరిస్తుంది.

◆ పెళ్ళిళ్ళు అయి విడిపోతూంటే సర్పదోషంగా భావించండి.

◆ ఇంటిలోని పెద్దవారు అకాలమరణం చెందుతూంటే సర్పశాపంగా భావించి తగు పరిహారాలు చేయించండి.


◆ సుమంగళి స్త్రీలు  అద్దంలో చూస్తూ ఈ క్రింది మంత్రాన్ని చెప్పండి,

ఓం సర్వేశ్వరీ సర్వ శక్తి స్వరూపిణీ మమ కుటుంబ రక్షాం కురు కురు స్వాహాః

◆ స్త్రీలు ఉదయం లేవగానే ముందు కనపడేట్టు గణపతి చిత్రాన్ని ఉంచండి.

◆ వీలయినంత ఆకుపచ్చ,ఎర్రని గాజులు ధరించండి.

◆ ఉదయం stove వెలిగించే ముందు ఓం బ్రహ్మణే నమః అని చెప్పండి.

◆ స్రీలు భోజనం తరువాత వీలు వెంబడి తాంబూలసేవనం చేయండి.
చదువు సరిగ్గా రాని మీ పిల్లలకు తాంబూలం నమిలి కొంచెం పిడతను వారికి తినిపించండి.

◆ మీకెవరికైనా తరచూ ప్రమాదాలు ఎదురైతే కుజగ్రహానికి సంభందించిన పూజలు జరిపించండి.

◆ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురైతే శనిగ్రహానికి పూజలు జరిపించండి.

◆ పనులలో ఆటంకాలు ఎదురైతే గురుగ్రహా శాంతులు జరపండి

◆ సమాజంలో గౌరవం పొందాలనుకుంటే సూర్యగ్రహానికి పూజలు జరపండి,

◆ మనశ్శాంతి కరువైతే చంద్రగ్రహ శాంతి చేయించండి.6.వ్యాపారం లో ఇబ్బందులు ఎదురైతే బుదునికిశాంతి చేయండి

◆ సంసారం లో చిక్కులు ఏర్పడి సుఖశాంతులు దూరం అయినపుడు శుక్రునికి శాంతి చేయించండి.

◆ ఐదు గురువాలరాలు దత్తాద్రేయుడు లేదా సాయి మందిరంలో మీ వయస్సుని బట్టి అన్ని ఆవునెయ్యి దీపాలు వెలిగించడం వల్ల గురు కృప లభిస్తుంది.

◆ వర్షాకాలం లేదా చలికాలంలో పేదలకు నల్లని గొంగళ్ళు పంచడం వల్ల శనిదేవుని కృపకు పాత్రులవుతారు.

◆ ఏడు శనివారాలు హనుమాన్ సింధూరం తీసుకొని 108 రాగి ఆకులపై శ్రీ రామ్ అని వ్రాసి పారే నీటిలో వేయండి.
ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.

◆ జఠామాఁసి , మైశాచి, ఊదు లోబాన్ కలసి ధూపం వేయడం వల్ల ఇంట్లో దుష్టశక్తులకు నివాసముండదు.

◆ ఇంట్లో నెమలి కట్టను ఉంచడం వల్ల సూక్ష్మ శరీర పీడలు బాధించవు.

◆ ఒక విస్తరాకు తీసుకొని ఒక మినుప వడ,కొంచెం స్వీటు,ఒక మేకు,కొన్ని మిరియాలు,నెయ్యిదీపం సాయంత్రం  సంధ్యా సమయంలో రావిచెట్టుకి నీళ్ళుపోసి వస్తువులన్నీ విస్తరాకులో పెట్టి పూజించడంవల్ల అనేక పీడలు తొలగును,నాలుగు అమావాస్యలు.

◆ భార్యా భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు నిత్యం అవుతుంటే తాంబూలాన్ని మీ పూజగదిలోని అమ్మవారికి సమర్పించి రోజూ ఇద్దరూ తినండి,


■ ఇంట్లో దరిద్రాలకు తావులేకుండా సుఖ శాంతి కొరకు ఈ క్రింది మంత్రాన్ని నిరంతరం మానసిక జపం చేయండి.

■ సూర్యునికి ఆర్ఘ్యం ఇచ్చే జలంలో ఎర్రనిపూలు, ఎర్రచందనం, కుంకుమపువ్వు, గోరోచనం, జాపత్రి కలపడం వల్ల సూర్యదేవుని కృపకు పాత్రులు కాగలరు.

■ పిల్లలకు దిష్టి దోషాలు తొలగడానికి పసుపు కలిపిన బియ్యాన్ని వారిచే పక్షులకు తినిపించండి.

■ పిల్లలు మీ మాటవినడం లేదంటే కుమారస్వామి ఆరాధన చేయండి.

◆ మీ మీద ఏవైనా ప్రయోగాలు జరిగినట్టు అనుమానం కలిగితే ప్రత్యంగిరా, లేదా నృసింహ ఉపాసన మొదలుపెట్టండి.

హ్రీం కయేఈలహ్రీం హసకలహ్రీం సకలహ్రీం


◆ చిన్నరాగి చెంబులో ఐదు రాగి నాణేలు మద్యలో రంధ్రం చేసినవి, రెండు వెండి నాగులు, హనమ పాదాల దగ్గరి చందూరం, చిన్న త్రిశూలం, రెండు వెండి పాదుకలు, ఇవన్నీ నదీ జలముతో రాగిచెంబు నింపి దాంట్లో వేసి పైనుంచి రాగి మూతతో సీల్ వేయించి గృహ,మరియు వ్యాపార స్థల నిర్మాణపు సింహద్వారపు లోపలి వైపు కుడిపక్క పాతిపెట్టండి.దీనివల్ల ఎలాంటి స్థలదోషమైనా నిర్మూలించబడుతుంది.
ఇదివరకు నిర్మించిన వాటికైనా సరే.

◆ శనిదేవుని సంతుష్టి కొరకు శనివారం మీ భోజనం లో నల్లసెనిగెలు ఉండేట్టు చూడండి.

◆ ఐదు తమలపాకులు తీసుకొని అన్నింటిపై కొంచెం బెల్లం ఉంచి ఊరి బయట ఉన్న అమ్మవారి గుడిలో సమర్పించి దీపం వెలిగించి ఈ స్తోత్రాన్ని 48 సార్లు చదవండి.

యాదేవీ సర్వ భూతేషు ధన రూపేణ సంస్థితః నమస్తస్త్యై నమస్త్యస్త్యై నమస్త్యస్త్యై నమోనమః 

తరువాత దేవి పాదాలదగ్గరి కుంకుమ పూవులు తీసుకొని ఇంట్లో డబ్బులు పెట్టే చోట పెట్టండి.

◆ కొడుకుల్లో పెద్దవాడు ఒక్కసారైనా కాశీ, గయా వెళ్ళి పెద్దలకు పిండ ప్రధానాలు చేయించండి.

◆ ప్రతి శనివారం ఇంట్లో ఉన్న పలిగిన,విరిగిన వస్తువులు పడేయండి.
బూజు దులపడం శుభ్రం చేయడం చేయండి.

◆ ధనప్రాప్తి కొరకు ఏదైనా అమ్మవారి ఉపాసన చేస్తూ అమ్మవారి దగ్గర ఒక లవంగాన్ని ఉంచండి.

◆ ప్రతిరోజూ పూజలో శ్రీ సూక్తం తప్పని సరి చదవండి.

◆ పూజగదిలో తప్పని సరి ఏకాక్షి కొబ్బరికాయను ఉంచడంవల్ల ధనప్రాప్తి జరుగుతుంది.

◆ ఉదయం లేవగానే రెండు అరచేతులు చూసి నాలుగైదు సార్లు ముఖంపై తిప్పడంవల్ల లక్ష్మి ప్రాప్తి జరుగుతుంది.


◆ మీ యింట్లో అమ్మవారికి సంభందించి ఎలాంటి పూజ జరిగినా తాంబూలం నైవేద్యంగా తప్పనిసరి పెట్టండి.

◆ వీలైనంత గణపతికి లడ్డూ నైవేద్యం పెట్టండి.

◆ శ్రీచక్రోపాసన చేసే సాధకులు వీలైనంత కాషాయ వస్త్రాలు ధరించండి.

◆ మీరు చేసే పూజలో అష్టగంధం, అక్షితలు, పసుపు, కుంకుమ, నైవేద్యం, ధూపం, దీపం పువ్వులు ఖచ్చితంగా ఉంచండి.

◆ పురుషులు ప్రతిరోజు తప్పకుండా తలస్నానం చేసి సూర్యునికి నమస్కరించి పూజలో కూర్చోండి.


★ మీ పడక గదిలో నైఋతి లో ఉత్తరం వైపు బీరువాను ఉంచండి,

★ మీ ఈశాన్య గదిలో ఈశాన్యమూల గణపతి ప్రతిమ లేదా ఫోటోలు పెట్టకండి.

★ గోడలపై పెన్సిలు,బొగ్గు గీతలు గీయడం వల్ల అప్పులపాలయే అవకాశం ఉంది.అలాగని పిల్లలని దండించకండి.

★ వీలైనంత నల్లకుక్కకు రొట్టెలు తినిపించడం వల్ల భైరవుని కృపకు పాత్రులు కాగలుగుతారు.

★ కాకులకు బియ్యం వేయడం వల్ల పితృదేవతలు సంతుష్టి చెందుతారు.


◆ శుక్రవారం సాయత్రం చిన్న పసుపు కొమ్ము తీసుకుని శ్రీ సూక్తం16సార్లు చదివి పూజించి స్త్రీలు పర్సులో పెట్టండి.

◆ సర్పదోషము ఉన్నవారు రాహుకేతువులను కాకుండా సర్పాలను పూజించండి.

◆ ఎప్పుడూ డబ్బు లకు ఇబ్బంది ఉన్నవారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉంగరాన్ని ధరించండి.

◆ పిల్లి కళ్ళు ఉన్నవారు (cat eyes ) వైఢూర్యాన్ని ధరించడం వల్ల దుష్టశక్తులు ఆవహించవు.

◆ మీ ఇంటి గోడలపై కొన్ని అదృష్టాని కలిగించే వాక్యాలను పేపరుపై వ్రాసి అతికించి అప్పుడప్పుడు చదువుతూ ఉండండి.


◆ పిల్లలకు ఎప్పుడైనా వికారంగా ఉండి సరిగ్గా తినకుంటే ఒక కొబ్బరికాయ లేదా గుడ్డుని వారిపైనుండి తిప్పి కూడలి లో వేసిరండి.

◆ మీ దగ్గర ఎప్పుడూ రెండు లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, సురిడి కాయలు జేబులో ఉంచడం వల్ల జేబు ఖాళీ ఉండదు.

◆ ఉదయం లేవగానే మీ ఎదురుగా చూడటానికి పసుపు, ఆకుపచ్చ రంగును కలిగిన ఏదైనా వస్తువు ఉంచండి,

◆ మీరు వాడే పర్సు వీలైనంత ఎరుపు రంగులో ఉండేట్టు చూడండి.

◆ సుహాసినులు వీలైనంత ఎరుపు లేదా ఆకుపచ్చ గాజులు ధరించే ప్రయత్నం చేయండి.


■ మీరు పొదుపు చేయదలచుకుంటే భరణీ నక్షత్రం లో చేయండి.

■ మీరు డబ్బు పెట్టేచోట కొన్ని అక్షితలు నాలుగు లక్ష్మీ గవ్వలు నాలుగు సురిడి కాయలు నాలుగు చిన్న ఆకుపచ్చ గాజులు శ్రీ సూక్తం చదివి పెట్టండి.

■ మీ చేతిలో డబ్బు నిలవడం లేదా? మీకు వచ్చిన లాభంలో పది శాతం దాన ధర్మాలకు కెటాయించండి.

■ అవసరాన్ని మించి డబ్బు రానపుడు మీ కుల దైవానికి మొక్కులు చెల్లించంచండి,

■ ఎపుడూ డబ్బు కు ఇబ్బంది అయితే వీలయినంత చిన్న పిల్లలకు స్వీట్లు చాక్లెట్లు పంచండి.


■ మీ యింట్లో దక్షిణం వైపు మురుగు కాలువ ఉంటే ఉత్తరం  వైపు ఉన్న మీ గుమ్మానికి కుబేరయంత్రం లోపలివైపు వేయండి.

■ ఈశాన్యంలో మెట్లు లేదా బరువైన కట్టడం ఉంటే వాటికింద లేదా ప్రక్కన ఒక అడుగు గొయ్యితీసి దాంట్లో కూర్మా యంత్రాన్ని ఉంచి నీటితో నింపండి.

■ వాయవ్య గోడకు ఆనుకుని తగిలి మెట్లు లేదా toilets కట్టడం వల్ల దీర్ఘకాలిక కోర్టుకేసుల్లో ఇరుక్కుంటారు.

■ అమావాస్య తిథిలో పుట్టిన అమ్మాయి ని పెళ్ళి తరువాత అత్తవారింటికి పంపేముందు కాళ్ళకు పారాణి పెట్టి తెల్లగుడ్డపై పాదముద్రలు తీసుకుని గుడ్డను డబ్బు పెట్టే బీరువాలో పెట్టండి.

■ వంటగదిని వీలైనంత ఆగ్నేయం లేదా వాయవ్యంలో కట్టండి.


● మీ యింటి వంటగదిలో ఒక నల్ల తుమ్మచెట్టు ముక్కని దారంతో వేలాడదీయండి.

● మీకు వీలైనప్పుడల్లా చీమలకు బెల్లం లేదా చక్కెర వేయండి.

● మీ ఇంట్లో ఉన్న దేవతా చిత్రాలు అలాగే దివంగత వ్యక్తుల ఫోటోలపై అష్టగంధాన్ని నీటితో కలిపి చిలకరించండి.

● సంధ్యాసమయంలో ఇంటి సుహాసిని ఖచ్చితంగా దీపం వెలిగించండి.
ఉదయం ఇంటి యజమాని వెలిగించాలి.

● ఇంటినుండి యజమాని ఉదయాన్నే బయటకు వెళ్ళేముందు ఖచ్చితంగా ఇల్లు వాకిలి ఊడ్చండి.
అలాగే కొంచెం బెల్లం ముక్కలేదా గ్లాస్ మంచినీళ్ళు తాగి బయటకు వెళ్ళండి.

● తెల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల లక్ష్మీ దేవత ప్రసన్నమౌతుంది,

● పేదవారికి భోజనం ,గుడ్డలు ఇవ్వడానికి ప్రయత్నించండి.అలాగే వికలాంగులకు సేవ చేసుకోండి.

● ధనానికి సంభందించిన ఏవైనా పనులు సోమవారం పెట్టుకోండి.

● ఉద్యోగ సంభందించిన పని మీద భయటకు వెళ్ళేముందు ఎవరైనా కోన్ని నల్లమినుములు తీసుకొని వెళ్ళేవారిపైనుండి ఐదుసార్లు తిప్పి పక్కన వేయండి.

● చలికాలం వీలైతే నల్లటి గొంగళ్ళను రాత్రి రోడ్డు పై పడుకున్న అనాథల పై కప్పండి.

◆ నిద్ర లేవగానే రెండు అరచేతులను కాసేపు చూసి మీ ముఖాన్ని రుద్దండి.

◆ మీ నాసికారంధ్రాల్లోంచి ఎటువైపునుండి శ్వాస బయటకు వస్తుందో ఆ వైపు కాలుని ఓం లక్ష్మి నారాయణాయ నమః అని కింద పెట్టండి.

◆ మీ వంట పూర్తయిన తర్వాత మొదటిముద్ద ఆవుకి , కుక్కకి లేదా కాకులకు తీసి పక్కన పెట్టండి.

◆ మీ ఇంట్లో ధాన్యం  పట్టించేముందు దాంట్లో కొంచెం గోధుమలు కలిపి పట్టించండి.

◆ శనివారం ఎంతవీలైతే అంత నల్ల శెనగలు మీ ఆహారంలో ఉండేట్టు చూడండి.

◆ డబ్బు సంబంధించిన పనిమీద ,బయటకు వెళ్ళేముందు మీ గృహ మరియు గ్రామదేవతలకు నమస్కరించి వెళ్ళండి.

◆ ఆదివారము వీలైతే సహదేవి వృక్షం వేరుతెచ్చి ఎర్రని గుడ్డలో కట్టి ఇంట్లో పూజా మందిరములో పెట్టండి.

◆ మీకు విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఒక మీటరు తెల్లగుడ్డ ,ఐదు గులాబిపువ్వులు తీసుకొని మీ పరిసర ప్రాంతంలో  నీళ్ళు పారే కాలువ వద్దకెళ్ళి గుడ్డ పరచి 5 గులాబిపువ్వులు గాయత్రీమంత్రం చదువుతూగుడ్డలో కట్టి కాలువలో వేయండి.

◆ బ్యాంకులో డబ్బులు వేసేముందు ఏదైనా లక్మీ మంత్రం స్మరించండి,

◆ ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బులు రాకుంటే మఱ్ఱిచేట్టు దగ్గరకు వెళ్ళి రెండు ఊడలను కలిపి ముడివేయండి,వేసేముందు డబ్బులు రాగానే వచ్చి ముడి విప్పుతానని చెప్పండి,వచ్చినాక వెళ్ళి చెట్టు మొదల్లో అగరు వత్తులు ముట్టించి కొంచెం చక్కెర వేసి ముడి విప్పండి,కృతజ్ఞతలు తెలిపి నమస్కారము చేయండి.

◆ పదకొండు మంచి గవ్వలు కుంకుమ పువ్వు ని నీళ్ళతో కలిపి గవ్వలకు పట్టించి పసుపు గుడ్డలో చుట్టి డబ్బు పెట్టే చోట పెట్టండి, డబ్బు రావడం జరుగుతుంది.

◆ ప్రతినెల ఒకరోజు ఏదైనా ఆలయానికి వెళ్ళి ఊడ్వడం నీటితో కడగడం ఇంకా ఏ దైనా సేవ చేయండి.

◆ ఆకస్మిక ధన ప్రాప్తి కొరకు ఏదైనా స్మశానంలో ఉన్న శివాలయంలో పాలు తేనె సోమవారం నుండి మళ్ళీ సోమవారం వరకు నివేదన చేయండి.

◆ మీ వ్యాపార స్థలంలో ఆవుపేడతో చిన్నగా అలికి పసుపుతో త్రికోణమువేసి దానిపై ఆసనము వేసి కూర్చుని ఏదైనా లక్ష్మీ మంత్రం 15 నిమిషాలు చేయడం వల్ల వ్యాపారం అభివృద్దిలో ఉంటుంది.

◆ పసుపురంగు గవ్వకి చిన్న రంధ్రం చేసి ఎరుపు దారంతో పిల్లల మెడలో వ్రేలాడదీయడం వల్ల దిష్టి దోషాలు తొలగుతాయి.

◆ పావుకేజీ బెల్లం తీసుకుని నీటిలో కలిపి పానకం తయారు చేసి స్మశానంలో ఒక పక్క పోసి రండి. ఎలాంటి దుష్టాత్మలు వేధించవు.

◆ ఎంతకూ పని దొరకనపుడు రాత్రి ఒక నిమ్మకాయ నాలుగుముక్కలు కోసి కూడలిలో నాలుగుదిక్కులా వేసిరండి శనివారం నుండి మళ్ళీ శనివారం వరకు .

◆ ఎంత వీలయితే ఉదయం లేవగానే ఇష్టదైవాన్ని గృహదేవత గ్రామ దేవతకు నమస్కరించండి.

◆ వీలయితే ఏకముఖ రుద్రాక్ష ధరించడం వల్ల దైవికశక్తుల తోడ్పాటు ఉంటుంది. ఙ్ఞానవృద్ది జరుగుతుంది .

◆ భార్యా భర్తల మధ్య ప్రేమకై ముంజేతిపై ఎర్రని దారాన్ని కంకణంలా ధరించండి.


★ శత్రు భాద నివారణకు తెల్ల జిల్లేడు వేరు కృత్తికా నక్షత్రం రోజు సాయం సంధ్య వేళలో తెచ్చి కుడిచేతి ముంజేతికి కట్టుకోండి.

★ ఒక తెల్లని పేపరు పై మీ శత్రువు పేరు తల్లి పేరు బొగ్గు తో వ్రాసి ఊరి భయట స్మశానంలో పాతిపెట్టండి.

★ తెల్ల ఆవాలు నృసింహ,లేదా భైరవ మంత్రంతో మంత్రించి మీ ఇంటి ఆవరణ లో చల్లడం వల్ల శత్రువు మిమ్మల్ని బాధించడు.

★ శత్రువు పేరు తల్లిపేరు భోజపత్రం పై గంధం తో వ్రాసి తేనె సీసాలో పెట్టి మూత బిగించి పూజా గదిలో పెట్టండి.

★ శత్రువు మరీ పెట్రేగి పోతే ఎండు మిరపకాయలు ఐదు తీసుకొని మీపై నుండి తిప్పి శత్రువు పేరు తీసుకుని ఇంటి భయట కాలుతున్న మంటలో వేసేయండి.
  
★ ఏదైనా వ్యాపారము లేదా పెట్టుబడి విషయంలో మీ భార్య సలహా కూడా తీసుకోండి.

★ వయసులో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా బొట్టు గాజులు ధరించండి, దీనివల్ల పెళ్ళి తరువాత మంచి గౌరవప్రదమైన కుటుంబం లభిస్తుంది.

★ సుమంగళి స్త్రీలు ఖచ్చితంగా పాపిట బొట్టు ధరించండి.
పురుషులు ఉదయం లేవగానే దాన్ని దర్శించండి.

★ బయటనుండి ఏ విధంగానైనా డబ్బులు వస్తే మీ భార్యచేతికిచ్చి అవసరాన్ని బట్టి మళ్ళీ తీసుకోండి.
(ఈ విషయంలో ఎందుకు ,ఏమిటి? ఏక్కడివి ? అని భార్యలు అడగకండి.)

★ భర్త భయటకు వెళ్ళేముందు పోరపాటునకూడా ఎక్కడికి ?ఎందుకు ? ఎప్పుడొస్తారు.
అని అడగకండి.
వెళ్ళేపనిలో ఆటంకమేర్పడుతుంది.

★ ఏదైనా వ్యాపారము లేదా పెట్టుబడి విషయంలో మీ భార్య సలహా కూడా తీసుకోండి.

★ వయసులో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా బొట్టు గాజులు ధరించండి,దీనివల్ల పెళ్ళితరువాత మంచి గౌరవప్రదమైన కుటుంబం లభిస్తుంది.

★ మందబుద్ది పిల్లలు రోజూ ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి.ఓం హ్రీం శ్రీం ఏం వద్ వద్ వాగ్వాదినీ సరస్వతీ తుష్టి తుష్టి తుభ్యం నమః

★ పిల్లలకు దిష్టి తగిలితే కొంచెం crystal salt తీసుకొని ఓం భైరవాయ హుం ఫట్ అని 7 సార్లు పై నుండి తిప్పి పారవేయండి.

★ కొద్దిగా విభూతి తీసుకొని ఓం చైతన్య ఘోరఖ్ నాథ్ నమః మంత్రాన్ని 108 సార్లు చదివి ఎర్రని గుడ్డలో  కట్టి ఎర్రనిదారంతో మెడలో కట్టడంవల్ల నరదిష్టి నుండి విముక్తి లభిస్తుంది.

★ అల్పాయుష్షు లేదా అనారోగ్యం ఉన్న పిల్లకు హనుమాన్ మూర్తి వెండిబిళ్ళ చేయించి మెడలోవేయండి.

★ పిల్లలకు ఎంతకూ జ్వరం తగ్గనపుడు గ్లాస్లో నీళ్ళు తీసుకుని ఓం ఛాముండాయ నమః జ్వరం హర హరఅని 11 సార్లు చదివి నీళ్ళకు మంత్రించి ఇవ్వండి.


★ మీ సింహద్వారము తలుపు పై లంగరు బొమ్మను చిత్రించడం వల్ల సంపద చేకూరుతుంది.

★ భగవద్గీతలోని 9వ అధ్యాయము ప్రతీరోజూ చదవండి.

★ శంకపుష్పము వేరుని రవి పుష్యమిలో తెచ్చి వెండి డబ్బాలో పెట్టి పూజా గదిలో పెట్టండి.

★ సింహద్వారము లోపలివైపు కుడివైపు తొండముకలిగిన గణపతి ఫోటోను అతికించండి,ఏదైనా పనిమీద వెళ్ళైముందు నమస్కరించండి.

★ మీ సంపాదనలో దశాంశ భాగాన్ని ఇతరుల సేవ కొరకు  కెటాయించండి.

★ మీకు ఎవరైనా శత్రువులు ఇబ్బంది పెడితే నాలుగు జీడిగింజలు తీసుకొని భైరవ లేదా ప్రత్యంగిరా మంత్రాన్ని 11సార్లు చదివి ఊరి బయట తుమ్మచెట్టు మొదల్లో పాతిపెట్టండి.దానికి ముందు మీ శత్రువు పేరునీ 11 సార్లు ఉచ్చరించండి.

★ అప్పులవాళ్ళు ఇబ్బంది పెడితే ప్రతీరోజు పావురాలకి జొన్నలు వేయండి.

★ ఏదైనా పని ఎంతకూ కానపుడు ఐదు మిరియాలు తీసుకుని మీ సింహద్వారం దగ్గర నాలుగు మిరియాలు నాలుగు దిక్కులా ఇంకోటి పైకి విసిరేసి భయలు దేరండి.

★ ఎంతవీలైతే మీరు వాడే పర్సు ఎరుపు రంగులో ఉంచండి.

★ మీ బీరువాలో డబ్బులు పెట్టే చోట నాలుగు గోమతి చక్రాలు శ్రీ సూక్తం చదివి చిన్న శ్రీయంత్రాన్ని ఉంచండి,

బయటకు వెళ్ళేముందు మీ గృహ మరియు గ్రామదేవతలకు నమస్కరించి వెళ్ళండి.

★ ఆదివారము వీలైతే సహదేవి వృక్షం వేరుతెచ్చి ఎర్రని గుడ్డలో కట్టి ఇంట్లో పూజా మందిరములో పెట్టండి.

★ మీకు విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఒక మీటరు తెల్లగుడ్డ ,ఐదు గులాబిపువ్వులు తీసుకొని మీ పరిసర ప్రాంతంలో  నీళ్ళు పారే కాలువ వద్దకెళ్ళి గుడ్డ పరచి 5 గులాబిపువ్వులు గాయత్రీమంత్రం చదువుతూగుడ్డలో కట్టి కాలువలో వేయండి.

★ బ్యాంకులో డబ్బులు వేసేముందు ఏదైనా లక్మీ మంత్రం స్మరించండి,

★ ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బులు రాకుంటే మఱ్ఱిచేట్టు దగ్గరకు వెళ్ళి రెండు ఊడలను కలిపి ముడివేయండి, వేసేముందు డబ్బులు రాగానే వచ్చి ముడి విప్పుతానని చెప్పండి, వచ్చినాక వెళ్ళి చెట్టు మొదల్లో అగరు వత్తులు ముట్టించి కొంచెం చక్కెర వేసి ముడి విప్పండి, కృతజ్ఞతలు తెలిపి నమస్కారము చేయండి...


ఓం నమః శివాయ..!!🙏

మీ రామ్ కర్రి