కార్తిక పురాణం  21 వ అధ్యాయము


పురంజయుడు కార్తీక ప్రభావము నెరు౦గుట


             ఈ విధముగా యుద్దమునకు సిద్దమై వచ్చిన పురంజయునకు, కాంభో జాది భూపాలకులకు భయం కరమైన యుద్ద జరిగింది.

             ఆ యుద్దములో రధికుడు రధికునితోను, అశ్వ సైనికుడు అశ్వ సైనికునితో ను, గజ సైనికుడు గజ సైనికునితోను, పదాతులు పదాతి సైనికులతోను, మల్లులు,మల్ల యుద్ద నిపుణులతోను ఖడ్గ, గద, బాణ,పరశువు మొదలగు ఆయుధాలు ధరించి,
 ఒండొరుల డీ కొనుచు హుంకరించు కొనుచు, సింహ నాదములు చేసి కొనుచు, శూరత్వ వీరత్వ ములను జూపుకోనుచు, భేరీ దుందుభులు వాయించు కొనుచు,
శంఖములను పురించు కొనుచు,ఉభయ సైన్యములును విజయ కంక్షులై పోరాడిరి.

             ఆ రణ భూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొ౦డెములు, తొండలు, తలలు, చేతులు, హాహా కారములతో దీనా వస్థలో వినిపిస్తున్న ఆ క్రందనలు,పర్వతాల వలె పడియున్న ఏనుగుల, గుఱ్ఱముల క ళే బరాల దృశ్యములే ఆ మహాయుద్దమును వీరత్వము జూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకు వెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానము పై వచ్చిరి.

             అటువంటి భయంకర మైన యుద్దము సూర్యాస్త మయము వరకు జరిగినది.కాంభో జాది భూపాలుర సైన్యము చాలా నష్ట మై పోయెను. అయినను, మూడు అక్షౌ హిణులున్న పురంజయుని సైన్యము నెల్ల అతి సాహసముతో, పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమునన్నను పురంజయునికి అపజయమే కలిగెను.

                దానితో పురంజయుడు రహస్య మార్గ మున శత్రువుల కంట పడ కుండా తన గృహానికి పారి పోయెను. బలో పేతు లైన శత్రు రాజులు రాజ్యమునుఆక్రమించు కున్నారు.పురంజయుడు విచార ముతో సిగ్గుతో దు:ఖిం చుచుండెను ఆ సమయములో వశిష్టులు వచ్చి పురంజయుని ఊరడించి "రాజా! మున్నొక సారి నీ వద్ద కు వచ్చితిని.

            నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చెస్తున్న దురాచారాలకు అంతు లేదు. ఇక నైననూ సన్మార్గుడ వయి వుండుమని హెచ్చరించితిని. అప్పుడు నామాట లాన లేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తునుడ వైవున్నందున నే యీ యుద్ద మును ఓడిరాజ్యమును శత్రువుల కప్పగించితిని.

                 ఇప్పటి కైనా నామాట లాలకింపుము. జయాప జయాలు దైవాదాన ములని యెఱ్ఱి ౦గియు, నీవు చింతతో కృంగి పోవుటయేల?శత్రురాజులను యుద్ద ములో జయించి,నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపుకల దేవి,నాహితో పదేశము నాలకింపుము. ఇది కార్తీక మాసము.

             రేపు కృత్తి కానక్ష త్రముతో కూడిన పౌర్ణ మిగాన,
స్నాన జపాది నిత్యకర్మ లాచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధి ని దీపారాధనము చేసి,భగవన్నామ స్మరణమును చేయుచు నాట్యము చేయుము. ఇట్లో నర్చినచో నీకు పుత్ర సంత తి కలుగుతుంది. అంతియేగాదు,శ్రీమన్నారాయణుని సేవించుటవలన శ్రీ హరి మిక్కిలి సంతోషమొందినీ శత్రువలను దునుమాడుటకు నీకు చక్రాయుధ ము కూడా ప్రసాదించును.

            కనుక, రేపు అట్లు చేసిన యెడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్త నుడ వై దుష్ట సహవాసము చేయుట చేతగదానికి అపజయము కలిగినది? గాన లెమ్ము.శ్రీ హరి నీ మదిలో దలచి నేను తెలియ జేసినటుల చెయు" మని హితో పదేశము చేసెను.

శ్లో// అపవిత్ర: పవిత్ర వా నానావ స్దాన్ గ తో పివా
య: స్మరే తుడ రీ కాక్షం స బాహ్యా భంతర శుచి||

ఏక విశో ధ్యాయము- ఇరవ యెక్క టో అధ్యాయము సమాప్తము...