కార్తిక పురాణం-23 వ అధ్యాయము 


శ్రీ రంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట


అగస్త్యుడు మరల అత్రి మహర్షి ని గాంచి" ఓ మునిపుంగ వా!విజయమందిన పురంజయుడు యేమిచేసెనో వివరింపు" మని యడుగ గా అత్రిమహాముని యిట్లు చెప్పిరి-
కు౦భ సంభవా!పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావము అసమాన బలో పేతుడై అగ్ని శేషము,
 శత్రు శేషము వుండ కూడదని తెలిసి, తన శత్రు రాజుల నందరినీ ఓడించి నిరాటకంముగా తన రాజ్యమును యేలుచుండెనుతన యొక్క విష్ణు భక్తీ ప్రభావమువలన గొప్ప పరాక్ర మవంతుడు,పవిత్రుడు, సత్య దీక్షత త్పరుడు, నితాన్న దాత,భక్తి ప్రియవాది, తేజో వంతుడు, వేద వె దా౦గ వేత్త యై యుండను.

           మరియు అనేక శత్రువులను జయించి దశది శలా తన యఖ౦డ కీర్తిని ప్రసరింప చేసెను. శ త్రువులకు సింహ స్వప్నమై, విష్ణు సేవాధురంధరుడై, కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడ గెత్తి అరి షడ్వర్గ ములను కుడా జయించిన వాడైయుండెను.

          ఇన్ని యేల? అతడి ప్పుడు విష్ణు భక్తా గ్రే సరుడు,
సదాచార సత్పు రుషులలో వుత్తముడై రాణించుచుండెను.అయినను తనకు తృప్తి లోదు.
ఏ దేశమున, యే కాలమున, యే క్షేత్రమున యేవిధ ముగా శ్రీ హరి ని పూజించిన కృతార్దుడ నగుదునా?యని విచారించుచుండ గా ఒకానొక నాడు అశరీర వాణి" పురంజయా! కావేరీ తీరమున శ్రీ రంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠ మని పిలిచెదరు.

             నీ వచట కేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీ వీసంసార సాగర మున దాటి మోక్ష ప్రాప్తి నొందుదువు" అని పలికెను.అంతటా పురంజయుడు అ యశిరీర వాణి వాక్యములు విని, రాజ్య భారమును మంత్రులకు అప్పగించి, సపరి వార ముగాబయలుదేరి మార్గ మద్య మున నున్నపుణ్య క్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు,పుణ్య నదులలో స్నాన ము చేయుచు, శ్రీరంగ మును జే రుకొనెను.

             అక్కడ కావేరీ నది రెండుపాయలై ప్రవహించు చుండగా మధ్యనున్నశ్రీ రంగ నాథాలయమున శే షశయ్య పై పవళించియున్న శ్రీ రంగనాథుని గాంచి పరవశ మొంది, చేతులు జోడించి,

 " దామోద రా! గోవిందా! గోపాలా! హరే! కృష్ణా! వాసుదేవా!అనంతా!
 అచ్యుతా! ముకుందా!పురాణపురుషా!హృషి కేశా!
ద్రోపది మాన సంరక్షకా!ధీన జన భక్తపొషా!ప్రహ్లాదవరదా!
 గరుడ ధ్వజా ! క రి వ ర దా! పాహిమాం! పాహమాం!
రక్షమాం రక్షమాం! దాసోహం పర మాత్మ దాసోహం"

యని విష్ణు సోత్త్ర మును పఠించి,కార్తీక మాసమంతయు శ్రీ రంగమునందే గది పిత దుపరి సపరి వారు ముగా అయోధ్య కు బయలు దేరును. పురంజయుడు శ్రీ రంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములోచేసిన వ్రతముల, మహిమవలన అతని రాజ్యమందలి జనులంద రూ సిరి సంపదలతో ,పాడి పంటలతో, ధన ధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండిరి.

             అయో ధ్యానగరము దృఢ తర ప్రకార ములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనో హర గృహాగో పురాదులచో చతురంగ సైన్య సంయుత మై ప్రకాశించుచుండెను.అయోధ్యా నగర మందలి వీరులు యుద్ద నేర్పరు లై,రాజనీ తి గలవారై,వైరి గర్భ నిర్భదకులై, నిరంతరము విజయశిలురై,అప్రమత్తు లై యుండిరి.

            ఆ నగర మందలి అంగ నామణులు హంసగ జగామినులూ, పద్మ పత్రా యత లోచ నులూ నై విపుల శో ణీత్వము, విశాల కటిత్వము,సూక్ష్మ మద్యత్వము; సింహకుచ పినత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతికలిగి యుండిరి.

ఇరవై మూడవ అధ్యాయము సమాప్తం...