పిల్లలపెంపకం విషయంలో.... రామాయణం ఏం చెపుతున్నది?
.శ్రీ రాముడు సీతాదేవి నగలను లక్ష్మణుడికి చూపించి ఇవి మీ వొదిన కేయూరాలేగద ! ఒక్కసారి నువ్వు కూడా గురుతు పట్టు అంటే అప్పుడు లక్ష్మణస్వామి అంటారు కదా .......
🌺 నాహం జానామి కేయూరే
నాహం జానామి కుండలే
నూపురే త్వభి జానామి
నిత్యం పాదాభివందనాత్ 🌺
.
దీనర్ధం ఏమిటంటే ఓ అన్నా! వొదినగారు భుజానికి పెట్టుకునే కేయూరాలుగానీ గానీ,
చెవులకు పెట్టుకునే కుండలాలు గాని నే నెరుగను,
.
కానీ ఆవిడ పాదాలకు పెట్టుకునే నూపురాలను మాత్రం గుర్తు పట్టగలను.
.
ఎందుకంటే ఆ తల్లి పాదాలకు నిత్యం నమస్కారం చేస్తాను కాబట్టి .
.
పరస్త్రీ ని కన్నులెత్తి చూడని సంస్కారం!
..
అసలు ఆడువారి ముఖంలో ముఖంపెట్టి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎందుకు మాట్లాడాలి ?
ఈవిధమైన శీల సంపద లక్ష్మణుడికి ఎక్కడనుండి వచ్చింది ?
.
తల్లి సుమిత్రాదేవి పెంపకం!!
రాముడి తో అడవికి వెళ్ళేటప్పుడు ఆ మహాతల్లి కొడుకుకు ఏమని చెపుతుందో తెలుసా !
.
" రామం దశరధం విధ్ధి,
మాం విధ్ధి జనకాత్మజాం,
అయొధ్యాం అటవీం విధ్ధి
గచ్చ తాత యధాసుఖం "
.
రాముణ్ణి దశరధుడనుకో,
సీతను నన్ననుకో
అడవిని అయొధ్య అనుకో
హాయిగా వెళ్ళిరా నాన్నా!
.
ఇంత సంస్కారమున్న తల్లి పెంచింది కాబట్టే లక్ష్మణుడు అంత శీలవంతుడయ్యాడు . చీరతొలగి మత్తులో ఉన్న తారతో మాట్లాడవలసివచ్చినప్పుడు తలవంచుకుని మాట్లాడిన అద్భుత శీలసౌందర్యం లక్ష్మణస్వామిది !...
- స్వస్తీ...