ఒక చిన్న పాప కిటికీలోనుండి చూస్తూ ఉందీ ఎవరో కొంతమంది దుండగులు పక్కనే ఉన్న శివాలయాన్ని ధ్వంసం చేస్తూ కనిపించారు వెంటనే ఆ పాప తండ్రి దగ్గరకు వెళ్లి ఎవరో శివాలయాన్ని ధ్వంసం చేస్తున్నారనీ అడ్డుకోవాలనీ కోరింది. ఆతండ్రి పాపను దగ్గరకు తీసుకుని మనం మొఘలుల ఆదీనంలో ఉన్నామనీ అడ్డుకోవడం అసాద్యమనీ చెప్తాడు దానితో నిర్ఘాంతపోయిన ఆపాప బాధగా వెనుతిరిగింది.

 పాప పెరిగి పెద్దది అయ్యింది పెళ్లి జరిగింది ఒక రోజున అత్తవారింట్లో గుమ్మం దగ్గర నిల్చుని బయటకు చూస్తున్న ఆమెకు కొంతమంది దుండగులు ఎదురుగా ఉన్న దేవాలయం ధ్వంసం చేయడం కనిపిస్తుంది హుటాహుటిన భర్త వద్దకు వెళ్లి దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారనీ అడ్డుకోవాలనీ చెపుతుంది దానికి ఆ భర్త మనం ఖిల్జియా ప్రభువుల ఆదీనంలో ఉన్నా మనీ అడ్డుకుంటే మరణ శిక్ష విధిస్తారనీ చెప్తాడు ఈ సమాధాంతో ఏమాత్రం సంతృప్తి చెందని ఆమే ఇటువంటి సమాధానం మళ్ళీ వినకూడదూ అనుకుంటుంది.

కొంతకాలానికి ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది...

ఆ బిడ్డకు చిన్నతనం నుంచే రామాయణ మహాభారత గాధలు పురాణాలు వాటిలోని మంచి చెడులు హిందూ ధర్మం పై జరుగుతున్న దాడులు వాటిని ఎలా ఎదుర్కోవాలి ధర్మాన్ని ఎలా పరిరక్షించాలీ స్త్రీలపట్ల గౌరవ మర్యాదలతో మెలగడం యుద్ద విద్యలు ఇలా అన్నీ వివరంగా చెబుతూ పెంచసాగింది. 

కాలక్రమంలో ఒకరోజున వీధి చివరన దేవాలయాని ధ్వంసం చేస్తుండటం చూసి కొడుకును పిలుస్తున్న ఆమె పిలుపు పూర్తవకుండానే మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకుని సింహగర్జన చేస్తూ దుండగులపై విజృంభించి భవానీమాతా వర ప్రసాదమైన ఖడ్గంతో ఒకేఒక్క దెబ్బతో శతశిరఛ్ఛేదనం గావించి స్వరాజ్య సామ్రాజ్యమే తన లక్ష్యం గా ధర్మ పరిరక్షణే తన ద్యేయంగా నవాబుల పాలనపై తిరుగుబాటు బావుటా ఎగురవేశాడా నూనూగు మీసాల పదిహేడు ఏళ్ళ యువకుడు.

 ఆ తల్లి పేరు జిజియా భాయి ఆ కొడుకు పేరు శివాజీ భోంస్లే (ఛత్రపతికి శివాజీ మహారాజ్)
 తన పదిహేడవ ఏట ప్రారంభించిన ఉద్యమంతో జీవితాంతం అలుపెరగని పోరాటాలు చేసి
దాదాపుగా మొఘలుల పాలనకు స్వస్తి చెప్పి మరాఠ దేశంలో అన్ని ప్రాంతాలనూ కోటలనూ కైవసం చేసుకుని
ధర్మగ్లాని గావిస్తున్న వారి శిరఛ్ఛేధనం చేసి ధర్మాన్ని నాలుగు పాదాలపై మొహరింపజేసి యావధ్బారతావనీ జయహో ఛత్రపతి అనే విధంగా పరిపాలన సాగించి అజరామర కీర్తి ప్రతిష్టలు కైవసం చేసుకుని కాలగర్భంలో కలిసిపోయిన ఓ శివాజీ.

 నీవు సాధించిన ఆ స్వరాజ్యం ఈరోజు చెత్త రాజకీయ నాయకుల కుళ్ళూ కుతంత్రాలతో గొళ్ళు మంటుందయ్యా.నీవు స్థాపించిన ఆ ధర్మం విదేశీయులు సొమ్ములకు అమ్ముడు పోయిన స్వదేశీయిలు చేస్తున్న దేశ ద్రోహాలకూ సెక్యులరిజం పేరుతో వారు చేస్తున్న ఆగడాలకు బిక్కుబిక్కుమంటూ నువ్వు ఎప్పుడు వస్తావా అని దీనంగా ఎదురు చూస్తోందయా. ధర్మ గ్లాని గావిస్తున్న దేశద్రోహుల తలలు నరికి ఆ ధర్మాన్ని తిరిగి నాలుగు పాదాలపై ప్రతిష్టించడానికి మరలా ఎప్పుడయ్యా నీ రాక.

నీ రాకకై వేయి కన్నులతో ఎదురు చూస్తూ...

నీ చరితను వేయ్యి నోళ్ళ కీర్తిస్తూ...

నీవు చూపించిన మార్గంలో ధర్మస్థాపనకై దేశ రక్షనకై నిరంతరం పాటుపడతామని తెలియజేసుకుంటూ...

        నీ జయంతి ని పురస్కరించుకుని
నీకు మా నమస్సుమాంజలులు తెలియజేసుకుంటున్నాము 

జయహో ఛత్రపతి శివాజీ మహారాజ్.

జై హీంద్... భారత్ మాతాకీ జై...




- స్వస్తీ...