మనం మంచి నీళ్ళు ఎప్పుడు , ఎంత , ఎలా  త్రాగాలి ?


    అన్ని రోగాలకి చికిత్సకంటే , రోగాల బారిన పడకుండా ఉండటమే ఎంతో ప్రధానము అంటారు మహర్షి వాగ్భటాచార్యుడు . 

    "భోజనాంతే విషం వారీ" , అంటే భోజనం చివర నీరు త్రాగటం "విషం" తో సమానం . 

మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది . 

అక్కడ అగ్ని ( జఠరాగ్ని ) ప్రదీప్తమవుతుంది . 

ఆ అగ్ని తిన్న ఆహారాన్ని పచనం చేస్తుంది . 

ఇది ప్రధానమైన విషయం . 

    భోజనం తిన్న తరువాత నీళ్ళు త్రాగితే జఠరాగ్ని చల్లబడుతుంది . 

ఇక తిన్న ఆహారము అరగదు .

 అది కుళ్ళి పోతుంది . 

కుళ్ళిన ఆహారం నుండి వచ్చిన విషయవాయువులు శరీరమంతటా వ్యాపిస్తాయి . 

ఆ విషయవాయువుల వలన 103 రోగాలు వస్తాయి .

 ఆ కుళ్ళిన ఆహారం వల్ల వచ్చేది కొలెస్ట్రాల ,

 ఆహారం సక్రమంగా జీర్ణమైతే చెడు కొలెస్ట్రాల్ అసలు ఉండదు. 


నీరు త్రాగే విధానం :


  నీటిని గుటక గుటకగా త్రాగాలి . 

ఒక్కొక్క గుటక నోటిలో నింపుకంటూ చప్పరిస్తూ త్రాగాలి . 

వేడి వేడి పాలు త్రాగే విధంగా నీటిని త్రాగాలి . 

నీరు ఎపుడు త్రాగినా ఈ విధంగానే త్రాగాలి .

 ఇది నీరు త్రాగే సరైన విధానం . 

గటగటా నీరు త్రాగడం సరైన విధానం కాదు.


ఫలితము :
   
 నీటిని గుటక గుటక చప్పరిస్తూ త్రాగితే నోటిలోన వున్న లాలాజలంతో నీరు కలిసి పొట్టలోకి చేరుతుంది . 

పొట్టలో ఆమ్లాలు తయారవుతాయి . 

లాలాజలం పొట్టలోని ఆమ్లాలతో కలిసి న్యూట్రల్ అవుతుంది . 

అసలు నోటిలో లాలాజలం తయారయ్యేది పొట్టలోకి వెళ్ళటానికి , 

లోపలి ఆమ్లాలని శాంతింప చెయ్యటానికి .

 అపుడు మనం జీవితాంతం ఏ రోగాల బారినపడకుండా ఆరోగ్యంగా జీవించ వచ్చును.


ఎప్పుడు త్రాగాలి : 

 బ్రేక్ ఫాష్ట్ లేక భోజనమునకు గంట ముందు నీళ్ళు త్రాగాలి . 

బ్రేక్ ఫాష్ట్ లేక భోజనం చేసిన గంట న్నర తరువాత త్రాగాలి . 

(ఆహారం జఠర స్ధానంలో గంటన్నర వరకు అగ్ని ప్రదీప్తమై ఉంటుంది). 

అపుడు ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది‌ . 

భోజనం మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్ఛును . 

భోజనం ముగించాక గొంతు శుద్ధి కోసము , గొంతు సాఫీగా ఉంచటానికి 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్చును . 

ఉదయం బ్రేక్ ఫాష్ట్ లేక భోజనం తరువాత పండ్లరసాలు త్రాగవచ్ఛును .

మధ్యాహ్న భోజనం తరువాత మజ్జిగ త్రాగవచ్చును . 

రాత్రి భోజనాంతరము పాలు త్రాగవచ్చు .

      ఈ క్రమాన్ని ముందు వెనుకలుగా చెయ్యవద్దు .

 ఎందుకంటే ఆయారసాలను పచనం చేసే ఎంజైమ్స్ ఆ సమయాల్లో మాత్రమే మన శరీరంలో ఉత్పన్నమవుతాయి . 



నీరు ఎంత త్రాగాలి :

    మీరున్న బరువును 10 తోటి భాగించి 2 ను తీసివేస్తే వచ్చినది మీరు త్రాగవలసిన నీటి శాతం చూసుకొని త్రాగండి . 

ఉదా : మీరు 60 కిలోల బరువు వుంటే 60 ని 10 చే భాగించితే 6 వస్తుంది . 
దీనిలో నుండి 2 తీసివేస్తే 4 వస్తుంది.  
మీరు 24 గంటల్లో 4 లీటర్ల నీరు త్రాగవలెను . 


ఎలా త్రాగాలి :


ఎల్లప్పుడూ సుఖాసనంలో కూర్చొని గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగాలి . 

నిలబడి నీళ్ళు త్రాగరాదు . 

చల్లని నీళ్ళు ( Cool Water)  త్రాగరాదు . 

గోరు వెచ్చని నీళ్ళు త్రాగవలెను . 

ఎండాకాలములో ( మార్చి నుండి జూన్) మట్టికుండలోని నీరు త్రాగవలెను . 

మూత్ర విసర్జన తర్వాత నీళ్ళు త్రాగరాదు. 

మల విసర్జన తర్వాత నీళ్ళు త్రాగరాదు . 

స్నానం చేసిన వెంటనే నీళ్ళు త్రాగరాదు. 

మూత్ర విసర్జన తర్వాత నీళ్ళు త్రాగిన మూత్ర సంబంధ  వ్యాధులు వస్తాయి . 

మల విసర్జన తర్వాత నీళ్ళు త్రాగిన యెడల మలబద్ధకం వస్తుంది . 

స్నానం చేసిన వెంటనే నీళ్ళు త్రాగిన యెడల చర్మ వ్యాధులు లేక ఉబ్బసం వంటి జబ్బులు వస్తాయి . 

ఎండ నుండి నీడకు వచ్చి వెంటనే నీళ్ళు త్రాగితే సమస్యలు వస్తాయి . 

రిఫ్రిజిరేటర్ నీళ్ళు చాలా హానికరము . 

మనకు ఆహారము ఎంత ప్రధానమో , 

తిన్న ఆహారము సక్రమంగా జీర్ణమటం అంతే ప్రధానము .  

మనము తిన్న భోజనము జీర్ణము కాని యెడల అది కుళ్ళిపోతుంది .

 ఆ కుళ్ళిన ఆహారము వలన శరీరంలో విషవాయువులు పుట్టి 103 రోగాలకు కారణం అవుతుంది .

 మొట్టమొదట గ్యాస్ ట్రబుల్ , 

 గొంతులో మంట , 

గుండెలో మంట , 

ఎసిడిటీ , 

హైపవర్ ఎసిడిటీ , 

అల్సర్ , 

పెప్టిక్ అల్సర్ మొదలగునవి వస్తాయి . 

చివరగా క్యాన్సర్.  


      మీరు ఎల్లప్పుడూ నీటిని గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగిన యెడల , 

మీరు జీవితంలో ఏ రోగాల బారిన బడరు . 

సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వుంటారు .
  
ఈ సృష్టిలో ప్రతి జంతువు నీటిని చప్పరిస్తూ ఒక్కొక్క గుటకగా త్రాగుతుంది.


- రామ్ కర్రి
8096339900


- స్వస్తీ...