" కరోనా అవగాహనోపనిషత్తు "
ప్రశ్న 1 : కరోనా వైరస్ అంటే ఏమిటి ?
జ . కరోనా వైరస్ అనేది జీవి కాదు. ఇది కొవ్వుకణాలతో ఆవరింపబడిఉన్న సూక్ష్మాతి సూక్ష్మమైన , నిర్జీవమైన ఒక ప్రోటీన్ అణువు .
ప్రశ్న 2 : కరోనా వైరస్ ని నశింపచేయడం ఎలా ?
జ . కరోనా వైరస్ అనేది జీవి కాదు .
కనుక కరోనా వైరస్ ని నశింపచేయలేము .
దానంతట అదే ( క్షయం అవుతుంది )నశించిపోతుంది .
ఈ వైరస్( క్షయం) నశించే సమయం అది నివశించే ప్రదేశం , ఉష్ణోగ్రత, అది సోకిన వ్యక్తి యొక్క వ్యాధినిరోధకశక్తి ,లేదా ఇమ్యునిటీ ఫవర్ పై ఆధారపడి ఉంటుంది .
వాస్తవానికి కరోనా వైరస్ అనేది చాలా బలహీనమైనది .
తేలికగా నిరివీర్యమయ్యే గుణం కలిగినది .
కాని దానికి రక్షణకవచంగా కలిగి ఉన్న కొవ్వు కణాల వలన అది బలం సంతరించుకుంటుంది.
ప్రశ్న 3 : కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది ?
జ . కరోనా వైరస్ సోకిన వ్యక్తి నుండి మరొక వ్యక్తికి తేలికగా వ్యాప్తి చెందే గుణాన్ని కలిగి ఉంది .
ఇది సోకిన వ్యక్తి తుమ్మడం , దగ్గడం ద్వారా , మాట్లాడడం ద్వారా , శ్వాసించడం వదలడం ద్వారా వెలువడే శ్వాసవాయువు మరియు లాలాజల తుంపర్లు ముఖము , ముక్కు , కళ్ళల్లో పడడం ద్వారా లేదా వైరస్ అంటుకున్న పదార్ధాలను తాకడం ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క ముక్కు , నోరు , కళ్ళ ద్వారా సంక్రమించడం ద్వారా వ్యాప్తి చెందుతుంది .
ఇది కంటి పుసుకు ,ముక్కులోని చీమిడి , గొంతులోని కఫం లోని ప్రోటీన్ కణాలతో కలిసినప్పుడు తన యొక్క జన్యుకోడ్ ని మార్చుకోవడం ద్వారా ఆ కణాలను చైతన్యవంతం చేసుకోవడమే కాక వాటిని అధిక సంఖ్యలో వృద్ధి అయ్యేవిధంగా చేసి విస్తృతంగా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది .
ప్రశ్న 4 : కరోనా వైరస్ సోకిన వ్యక్తి యొక్క అనారోగ్య లక్షణాలు ఎలా ఉంటాయి ?
జ : కరోనా వైరస్ సోకిన వ్యక్తిలో దగ్గు, జలుబు, జ్వరము తుమ్ములు , ఆయాసం , ఊపిరి ఆడకపోవడం , వంటి నొప్పులు , గొంతు నొప్పులు , చాతి నొప్పులు , తలపోటు , రుచి వాసన తెలియకపోవడం వంటి ప్రాధమిక లక్షణాలు కనిపిస్తుంటాయి .
ఒక్కోసారి వైరస్ సోకినప్పటికి ఈ లక్షణాలు ఏవీ కనించకపోవచ్చు .
ప్రశ్న 5 : కరోనా వైరస్ సోకకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ?
జ . 1 జనసాంద్రత ఎక్కువగా ప్రదేశాలకు ,కార్యక్రమాలకు వెళ్ళడం తగ్గించుకోవాలి .
2 . అనివార్యమైతే తప్పక మూడడుగుల భౌతికదూరాన్ని పాటించాలి .
3. తప్పకుండా పేస్ మాస్క్ ధరించాలి.
4. బయటికి వెళ్ళి వచ్చిన ప్రతి సారీ కాళ్ళు చేతులు తప్పకుండా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి .
5 .సాధ్యమైనంతవరకు మనం వాడే ప్రతి వస్తువును శానిటైజర్ చేసి సబ్బుతో శుభ్రంగా కడుక్కుని వాడుకోవాలి .
6 . ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు తప్పకుండా పేస్ మాస్క్ మూతిమీద మరియు ముక్కుపై కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి .
7 . మనకు దగ్గు ,తుమ్ము వచ్చినప్పుడు ఇతరులకు దూరంగా ఉండాలి .
8. మనం ఇతరులను కలసినప్పుడు కరచాలనం చేయరాదు నమస్కారం చెప్పాలి .
9 . ఇతరులకు దగ్గు ,తుమ్ము వచ్చినప్పుడు వారికి దూరంగా ఉండాలి .
10 . బయటి నుండి రాగానే మనం ధరించిన బట్టలను వేడినీటిలో డెటాల్ వేసి ఉతుక్కోవాలి .
11 . కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలను తప్పకుండా ప్రతి పౌరుడికి పాటించాల్సి బాధ్యత ఉంది .
ప్రశ్న 6 : కరోనా వైరస్ సోకిన వ్యక్తి హోమ్ కోరంటైన్ లో తీసుకోవలసిన ట్రీట్ మెంట్భ షెడ్యూల్ ఏమిటి ?
జ . కరోనా వైరస్ సోకిన వ్యక్తి హోమ్ క్వారంటైన్లో తీసుకోవలసిన ట్రీట్ మెంట్ షెడ్యూల్ ...
06:00 AM మేల్కొండి
పరగడుపునే రెండు గ్లాసుల ఆవు మద్యగలో నిమ్మరసం, అల్లం, పుదీనా , సరిపడా ఉప్పు కలుపుకుని త్రాగండి .
06:30 AM నుండి 07:30 AM 1గంట దైవత్వం మీద ఎరుకతో ధ్యానం , యోగ ప్రాణాయామం చేయండి
07:30 AM 100ML | వేడి నీటిలో తేనె నిమ్మరసం కలుపుకుని త్రాగండి .
07:30 AM నుండి 08:00 AM విటమిన్ - సి | బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి .
08:30 AM 50 నుండి 100 ML | వేడి పాలు (ముడి పసుపుతో వేడి పాలు) త్రాగండి .
09:00 AM 05 నుండి 10 నిమిషాల వేడినీటిలో పసుపు వేసుకుని ఆవిరి పట్టండి.
12:00 AM 50 నుండి 100 ML వేడి నీటిలో నిమ్మకాయ రసం కలుపుకుని త్రాగండి .
01:00 PM నుండి 02:00 PM | విటమిన్ - సి + పౌష్టికరమైన శాకాహార బోజనం చేయండి
03:00 PM 05 నుండి వేడినీటిలో పసుపు వేసుకుని 10 నిమిషాల ఆవిరి పట్టండి.
06: 00 PM నుండి 07:00 PM 1 గంట దైవత్వం మీద ఎరుకతో ధ్యానం చేయండి .
07: 00 PM కి 100 ML వేడి నీటిలో తేనె నిమ్మకాయ రసం కలుపుకుని త్రాగండి.
07: 30 PM నుండి 08:30 PM విటమిన్-సి + పౌష్టికరమైన శాకాహార బోజనం డిన్నర్ చెయ్యండి .
9 PM కి 10 నిమిషాల పసుపు కలిపిన వేడి నీటి ఆవిరి పట్టండి .
నిద్రకు ముందు 9 :30 pm కి100ML | వేడి పాలల్లో పసుపు ఆవునెయ్యి కలుపుకుని త్రాగండి .
నిద్రకు ముందు రెండు ముక్కుల్లోనూ రెండు రెండు ఆవునెయ్యి చుక్కలను వేసుకుని పడుకోండి .
ఈ సమాచారం దేశానికి చేరితే సాధ్యమైనంతవరకు ఆసుపత్రి అవసరం లేకుండానే కరోనా వైరస్ నుండి ప్రజలందరినీ రక్షించవచ్చు .
ప్రశ్న 7 : దైవత్వం మీద ఎరుకతో ధ్యానం చేస్తే కరోనా వైరస్ నుండి మనల్ని మనం రక్షించుకోగలమా ?
జ : సమస్త మానవాళి కరోనా వైరస్ బారి నుండి శాశ్వత విముక్తికి దైవత్వం మీద ఎరుకతో ధ్యానం చేస్తూ ఆత్మశక్తిని పెంచుకుని తమ అంతరంగంలో దైవం అనే హోదాలో ధైర్యంగా ఉంటూ కరోనా వైరస్ తో కలసి ప్రయాణించడమే ఏకైక మార్గం!
👉 దైవత్వం మీద ఎరుకతో ధ్యానం చేయడం వలన నీ చుట్టూ ఆరా(దివ్యకాంతితో కూడిన శక్తివలయం) ఏర్పడుతుంది.
👉 ఆ ఆరాను దాటి ఏ దుష్టశక్తి(కరోనా లాంటి వైరస్సులు, వ్యాధులు ,సమస్యలు) మీ దరి చేరవు.
వ్యాధి శరీరంలో ఉండడం పెద్ద నేరమేమీ కాదు..
తప్పూ కాదు
కానీ మనలోని దాన్ని స్వస్థత పరిచే ధ్యాన శక్తి యొక్క
ద్వారాలు తెరవకపోవడమే....తప్పు..
ఎందుకంటే ?....
ఏ దుష్టశక్తి అయినా, ఏ వైరస్ అయినా
➡ ధ్యానం చేయని బహిర్ముఖుణ్ణే నాశనం చేస్తుంది.
➡ దైవత్వం మీద ఎరుకతో ధ్యానం చేసే అంతర్ముఖుణ్ణి నమస్కరించి వైదొలగుతుంది.
ఎందుకంటే ఒక సారి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి
కరోనా వైరస్ అందించిన అద్భుత జ్ఞానం
"యదా దైవం సదా శక్తి స్వరూపేణ సర్వత్రా స్వయంయేవ సంస్థితాః !
సత్యార్ధం : ఏదైతే సర్వస్వసృష్టికి మూలమూ,ఆధారమూ అయిన సృష్టికర్త దైవం ఉందో ఆ దైవం సదా ఎల్లప్పుడూ శక్తిస్వరూపంలో సర్వంలోనూ, స్వయంలోనూ,(అంతరంలోనూ)స్వయంగా మీరే మీరుగానే మీలోనే స్థితమై (కొలువై )వ్యాపించి ఉంది.
ఎలా అంటే
తిల మద్యే తైలం , క్షీర, మద్యే ఘృతం , బీజ మద్యే వృక్షం, అలాగే దేహ మద్యే దైవం అంటే దేహంలోనే పరమాత్మ ఉంటాడు
ఒకే విద్యుత్ అన్ని రకాల మిషన్లను, లైట్లను ,ప్యాన్, మోటర్ ను త్రిప్పుతుంది అలాగే ఒకే చైతన్యమే మనిషిలోనూ , ఏనుగులోనూ దోమలోను, చీమలోనూ, బ్యాక్టీరియాలోనూ, వైరస్ లోనూ ఉండి నడిపిస్తున్నప్పుడు అలాగే సర్వమూ దైవమే అయినప్పుడు భౌతికంగా సూక్ష్మాతి సూక్ష్మమైన చిన్ని వైరస్ మనిషిని ఎందుకు భయపెడుతుంది చంపుతుంది ?
నిజానికి వైరస్ వైరస్సే కాదు గోచర అగోచర జగత్తులలోని శక్తులన్నీ కలిపి మనమీద దాడి చేసినా మనకు కించెత్తుహానికూడా చేయలేవు మనం భయంతో కోరుకుంటే తప్ప ! అంటే సర్వోత్కృష్ణమైన ప్రకంపనాస్థాయిలో ప్రకంపించే ఆత్మస్వరూపులమే అయిన మనల్ని తక్కువ ప్రకంపనాస్థాయిలో ప్రకంపించే అతి సూక్ష్మమైన కరోనా వైరస్ మనకు ఎలా హాని చేయగలదు ?
మనమే భయం అజ్ఞానంతో మన ప్రకంపనాస్థాయిని తగ్గించుకుని కరోనా వైరస్ ని ఒకభూతంలా మహమ్మారిలా శత్రువులా భావించి దాని బారినపడి అనారోగ్యం పాలై దుఃఖిస్తూ మరణిస్తున్నారు .
నిజానికి ఏ కరోనా వైరస్ అయినా ఏ వ్యాదైనా మన అతిధి మన మిత్రుడు మన దైవం మన ఆచార్యుడు కనుక మనం అలా భావిస్తే దైవంగా భావిస్తే శక్తినిస్తుంది , మిత్రుడిగా భావిస్తే ప్రేమించి వెళ్ళిపోతుంది, అతిధిగా భావిస్తే ఆనందించి వెళ్ళిపోతుంది, ఆచార్యుడిగా భావిస్తే ఆధ్యాత్మి జీవితసత్యాలను ఎన్నింటినో నేర్పించి వెళ్ళిపోతుంది.
మీ యొక్క ఆత్మ చైతన్యశక్తి కంటే ఏది గొప్పది కాదు .
మీ యొక్క ఆత్మ చైతన్యశక్తితొ ఏ వైరస్నైనా , ఏ వ్యాధినైనా దరిచేరనీయకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు .
ఏ వైరసులతొ ఏ ముప్పు లేదు , సరికాని ఆహారపు అలవాట్లతో , నిరాశాకర దృక్పధాలతో , వినాశకరఆలోచనలతో , అనవసర భయాలతో మీ ఆరోగ్యాన్ని మీరే పాడుచేసుకుంటున్నారు , మీ ప్రాణానికి ముప్పుతెచ్చుకుంటున్నారు .
దైవత్వం మీద ఎరుకతో ధ్యానం చేస్తూ ధైర్యంగా ఉంటూ , ఆశాకరదృక్పధంతో భావించినప్పుడు మన దగ్గరకు ఏ వైరస్ అయినా , వ్యాధి అయినా వచ్చినా ఏమీ కాదు కాని శత్రువులా భావించి భయపడితే అది ఎంత చిన్న వ్యాధి అయినా, వైరస్ అయినా ఒక పెనుభూతంలా విజ్రుంబించి యుద్ధం చేస్తుంది
తద్వారా మనం శక్తిహీనులమై దాని బారిన పడి బలైపోతారు కనుక దైవత్వం మీద ఎరుకతో ధ్యానం చేసి మీ ప్రకంపనాస్థాయిని ఆత్మశక్తిని పెంచుకోండి .
అలాగే మీరు పిలవకుండా ఏ వ్యాధి , వైరస్ ,సమస్య మీ దగ్గరకు రాదు వచ్చిందంటే మీరు పిలిచే ఉంటారు మేము ఎందుకు పిలుస్తాం ? ఎలాపిలుస్తాం అనుకుంటున్నారా ?
మీరు పడే భయాలు , మీరు ఆలోచించే ఆలోచనలు, మాటలు , మీరు చేసే ప్రకృతి వ్యతిరేక పనుల ద్వారా మీకు తెలియకుండా మీరే పిలుస్తారు .
మీరే పిలిచారు ! కనుక పిలిచిన మీరే ... ఏ భయాలతో, ఆలోచనలతో పిలిచారో మరలా మీరే వాటితో మిత్ర భావంతో, అతిధి భావంతో, ఆచార్యభావంతో, దైవ భావంతో ఉంటూ భయాన్ని వీడి మిమ్మల్ని మీరు స్వయం నిర్బంధం చేసుకుని లాక్ డౌన్ అయ్యి కోరంటైన్ అయ్యి అంతర్ముఖులై దైవత్వం మీద ఎరుకతో ధ్యానం చేసి మీ ప్రకంపనాశక్తిని ,ఆత్మశక్తిని పెంపొందించుకోండి .
ఈ క్షణమే ఏ కరోనా వైరస్ మీ నుండి మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోతుంది .
ఓ కరోనా వైరస్ దేవుడా ! మిత్రుడా ! ఆచార్యా ! అతిధుడా ! నాకు ఇంతటి శక్తిని , జ్ఞానాన్ని , ప్రేమని , సరైన ఆరోగ్యస్పృహని ఇచ్చినందులకు నీకు శత సహస్రకోటి ధన్యవాదములు
ఇట్లు
నీ ప్రియమైన మిత్రుడు, శిష్యుడు , అతిధి , దేవుడు.
ప్రశ్న 8 : కరోనా వైరస్ కి బెస్ట్ ట్రీట్ మెంట్ ఏమిటి ? కోరంటైన్ అంటే ఏమిటి ?
జ . కరోనా వైరస్ కి బెస్ట్ ట్రీట్ మెంట్ సెల్ప్ కోరంటైన్ అవ్వడమే ! ఎందుకంటే కరోనా వైరస్ కి మందులు , ట్రీట్ మెంట్ లు లేవు కనుక!
కోరంటైన్ అంటే ఏమిటి అనుకుంటున్నారు ?
కోరంటైన్ అంటే అర్ధం స్వయం నిర్బంధం !
స్వయం నిర్బంధం అంటే బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుని మాస్కులు ధరించి సమయం దొరికిందని టీవీ చూడడాలు , మోబైల్ లో కాలక్షేపాలు , అనవసరమైన సెల్ పోన్ మెస్సేజ్ లు చాటింగ్ లు అనవసర భయాలతో అందరినీ భయపెట్టడం కాదు
నిజమైన కోరంటైన్ , లాక్ డౌన్ అవ్వడం అంటే స్వయంగా బాహ్యేంద్రియాలన్నిటిని కట్టివేసి మనస్సును అంతర్ముఖం చేసుకుని దైవత్వం మీద ఎరుకతో ధ్యానం చేసి మీ ప్రకంపనాస్థాయిని, ఆత్మశక్తిని పెంచుకోవడం !
అప్పుడు బాహ్యం నుండి వచ్చే ఏ వైరస్ మిమ్మల్ని ఏమి చేయలేదు
అందుకు ప్రత్యక్ష ఉదాహరణ
సీతాదేవి లంకలో కరోనా వైరస్ కన్నా భయంకరమైన రాక్షసుడైన రావణుని చెరనుండి తనను తాను కాపాడుకోవడానికి ఒంటరిగానే అశోకవనంలో (అశోకం అంటే ఏ శోకం లేనిది ) అశోకచెట్టు క్రింద కూర్చుని స్వయం నిర్బంధం చేసుకుని కోరంటైన్ అయ్యి అంటే తనలోకి తాను అంతర్ముఖురాలై ఆత్మశక్తిని పెంచుకుని ధైర్యంగా ఉంది కనుకనే అంతటి రాక్షసుడైన రావణుడు కూడా ఏమీచేయలేకపోయాడు .
లేదంటే మీరు భయంతో ఇంటిలోనే అన్నీ మూసుకుని కూర్చుని వైరస్ రాకుండా ఎన్ని చర్యలు జాగ్రత్తలు తీసుకున్నా మిమ్మల్ని మీరు ఏ విధంగానూ కాపాడుకోలేరు ఎందుకంటే పరీక్షిత్తు మహారాజు మునిశాపం వలన ఏడురోజులలో తక్షకుడు అనే భయంకరమైన విషనాగు కాటుచే చంపబడతావు అని ముందుగానే తెలిసి కూడా మనలాగే తానుకూడా తనను తాను లాక్ డౌన్ చేసుకుని స్వయం నిర్బంధం కోరంటైన్ అయ్యి ఏం చేసాడు ఒంటి స్థంభం మేడ, మేడ చుట్టూ అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసుకుని తలుపులన్ని మూసుకుని మేడపై కాలక్షేపం కోసం శుకమహర్షిచే భాగవత ప్రవచనం వింటూ తన పరివారాన్ని భవనం చుట్టూ రక్షణ పెట్టుకుని తన యావత్తు మహా సైన్యాన్ని పంపి విషనాగులన్నింటిని చంపిస్తాడు కానీ అసలైన కోరంటైన్ స్వయం నిర్బంధం చేసుకోకుండా అంటే అంతర్ముఖుడై ధ్యానం చేయకుండా ఆత్మశక్తిని పెంపొందించుకోకుండా భయాన్ని వీడకుండా కేవలం భౌతికమైన రక్షణచర్యలు ఎన్ని తీసుకున్నా ఆకాశమార్గంలో ఎగిరే పక్షినోటనుండి విడిచిన పండులో సూక్ష్మరూపంలో దాగి ఉన్న తక్షకుడు కాటువేస్తాడు .
కనుక ........
తస్మాత్ జాగ్రత్త !
తస్తాత్ జాగ్రత్త !!
తస్మాత్ జాగ్రత్త !!!
మీరు ఇప్పుడే భౌతికంగా కోరంటైన్ అవ్వడంతో పాటు దైవత్వం మీద ఎరుకతో ధ్యానం చేసి ఆత్మకోరంటైన్ అవ్వండి
మిమ్మల్ని మీరు కరోనా వైరస్ నుండి రక్షించుకోండి .
ప్రశ్న 8 : కరోనా వైరస్ సోకిన వారి మరణాలకు భయమే కారణమా ?
జ : కరోనా వ్యాధి అందరినీ అనవసరంగా భయాందోళనలకు గురిచేస్తోంది.
కరోనా సోకిన వారిలో మరణాలన్నీ కేవలం భయాల వలనే సంభవిస్తున్నాయి .
కానీ ధైర్యంగా ఉన్నవాళ్ళు ఏ ట్రీట్ మెంట్ లేకుండానే
కొన్ని లక్షల మంది సులువుగా బాగైపోయి, హ్యాపీగా, హాయిగా బ్రతుకుతున్నారు కదా.
ఇది గుర్తుంచుకోండి.
కరోనా వ్యాధి అనేది దగ్గు, జలుబు కంటే పెద్ద వ్యాధి కాదు.
మీ భయాలకు కారణం కేవలం అవగాహనా లోపమే అని తెలుసుకోండి .
యునైటెడ్ స్టేట్స్లో ఒక ఖైదీకి మరణశిక్ష విధించినప్పుడు, కొంతమంది శాస్త్రవేత్తలు ఈ ఖైదీపై కొన్ని ప్రయోగాలు చేయాలని భావించారు.
ఉరి తీయడానికి బదులుగా విషపూరితమైన కోబ్రా నీపై దాడి (attack) చేయడం వలన నీవు చంపబడతావని ఆ ఖైదీని భయపెట్టి చెప్పడం జరిగింది.
ఒక పెద్ద విషపూరిత పాము అతని ముందుకు తీసుకురాబడింది, వారు ఖైదీ యొక్క కళ్ళు మూసివేసి, కళ్ళకు గంతలు కట్టి, అతన్ని కుర్చీకి కట్టేసారు.
అతన్ని పాముతో కరిపించలేదు, గానీ రెండు భద్రతా పిన్స్ తో (Two safety pins) గుచ్చారు అంతే, ఆ ఖైదీ రెండు సెకన్లలోనే మరణించాడు.
ఆ ఖైదీ శరీరంలో పాము విషాన్ని పోలిన విషం ఉందని పోస్ట్మార్టం ద్వారా వెల్లడైంది.
ఇప్పుడు ఈ విషం ఎక్కడ నుండి వచ్చింది, లేదా ఖైదీ మరణానికి కారణమేమిటి?
ఆ విషం మానసిక రుగ్మతల ఒత్తిడి కారణంగా తన సొంత శరీరమే ఉత్పత్తి చేయబడిన విషం.!
మానసిక భయాందోళనల ఒత్తిడికి గురియై మరణించడం జరిపించారు.
మీ శరీరం మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సానుకూల స్పందన లేదా ప్రతికూల స్పందనలు బట్టి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. (The energy results depends up on our body produces the hormones positive energy or negative energy accordingly). తదనుగుణంగా మీ శరీరం హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.
90% అనారోగ్యాలకు మూలకారణం ప్రతికూల ఆలోచనల (Negative thoughts) వలన ఉత్పన్నమయ్యే అనారోగ్యాలే.
అలాగే ఈ రోజు మనిషి కరోనా వైరస్ మన గ్రామంలోకి వచ్చేసింది ,మన వీధిలోకి వచ్చేసింది ,మన అపార్ట్ లో వారికి వచ్చేసింది తనకు కూడా వచ్చేస్తుంది అని భయాందోళనలకు గురైనప్పుడు తన బాడీలో యాంటీ బాడీస్ రిలీజ్ అయి టెస్ట్ చేయించుకుంటే కరోనా వఃరస్ సోకకుండానే పాజిటివ్ రావడం తన తప్పుడు ఆలోచనలతో తనను తాను కాల్చుకుని తనను తాను నాశనం చేసుకుంటున్నాడు.
5 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వయస్సు ఉన్న రోగులు పాజిటివ్ నుండి కరోనా ప్రతికూలంగా ఉన్నారు.
గణాంకాలపైకి వెళ్లవద్దు ఎందుకంటే సగానికి పైగా ప్రజలు బాగానే ఉన్నారు, మరియు మరణాలు కరోనా వ్యాధి వల్ల మాత్రమే కాదు, వారికి ఇతర అనారోగ్యాలు ఉన్నాయి, కాబట్టి వారు భరించలేక మరణించారు.
కరోనా చేత ఇంట్లో ఎవరూ చనిపోలేదని గుర్తుంచుకోండి, రోగులందరూ ఎక్కువగా ఆసుపత్రులలోనే మరణించారు. ఈ మరణాలకు కారణం ఆసుపత్రిలో వాతావరణం మరియు మనస్సులో భయం ఉండటమే .
ఎల్లప్పుడూ మీ ఆలోచనలను సానుకూలంగా (Positive గా) ఉంచండి, సంతోషంగా ఉండండి.
కరోనా వ్యాధి అనేది దగ్గు, జలుబు కంటే పెద్ద వ్యాధి కాదు.
కరోనాకు భయపడకండి...
బోగస్ ప్రచారాలు నమ్మకండి...
కరోనా వచ్చింది అనగానే వారిని అంటరాని వారిగానో, ఎదో తప్పు చేసినా వారిగా చూడకండి. ఇది ఒక మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో అన్ని రకాల వారికి వస్తుంది. కరోనా వచ్చిన వారు first ధైర్యంగా ఉండాలి.
Covid positive వచ్చిన వారికి ఇచ్చే, మెడిసిన్స్
* ప్యారసిటమాల్-650mg టాబ్లెట్స్ ( Dolo 650)
* B-Complex వీత్ zinc ( zincovit)
* C Vitamin Tablets,
* Tab cetrizine
* Ambroxol syrup (దగ్గు ఉన్న వారికి మాత్రమే.)
సూచన మేరకు ఉదయం మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత రోజుకు 3 సార్లు paracetamol ట్యాబ్లేట్లు మూడు రోజులు వాడాలి.
పొడి దగ్గు ఉంటే దగ్గు సిరప్ ను ఉదయం 5ml, రాత్రి 5ml మూడురోజులు పాటు వాడాలి. రోజుకు ఒకటి B- complex tablet, ఒకటి C-Vitamin tablet మధ్యాహ్నం భోజనం తర్వాత వారం రోజుల పాటు ఇస్తారు.
మెడిసిన్ తో పాటు పాటించవలసిన నియమాలు ఏమిటి అంటే.
తప్పనిసరిగా వేడి నీళ్లు తాగడం.
రోజు ఉదయం, సాయంత్రం వేడి నీళ్లలో జండుబామ్ కానీ, జామా oil ( euclyptus), పసుపు కానీ వేసుకొని ఆవిరి పట్టడం.
రోజుకు మూడు సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేడి నీళ్లలో నిమ్మకాయ రసం, తేనె కలుపుకొని తాగడం.
రోజుకు నాలుగైదు సార్లు వేడి నీళ్లు విత్ Betadine సొల్యూషన్ గొంతులో పోసుకొని gargling చేయడం (ఉక్కిలించడం).
రాత్రి భోజనం అనంతరం పడుకునే ముందు సగం గ్లాసు పాలల్లో కొంచం పసుపు , ఆవునెయ్యి , నాలుగు మిరియాలు దంచి పొడి చేసుకొని కలిపి తాగడం.
''వీటన్నిటినీ వారం రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించడం వలన వారం రోజుల్లోనే సాధారణ స్ధితికి వచ్చేస్తారు."
వీటికి తోడు మంచి ప్రొటీన్ ఫుడ్, రోజుకు రెండు మధ్యాహ్నం, రాత్రి భోజనంతొ C-vitamin ఉన్న ఫ్రూట్స్ ఆపిల్, బత్తాయి, Orange ,నారింజ, బొప్పాయి ,జామ వంటి పండ్లు ఎక్కువగా తినాలి, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తింటే కరోనా వచ్చిన వారు వారం రోజుల్లో సాధారణ స్థితికి వచేస్తారు.
కరోనా వైరస్ ఒక వ్యక్తి శరీరంలో నుంచి మరో వ్యక్తికి వ్యాపించే సమయం 7 రోజులు మాత్రమే నని, 7 రోజుల తర్వాత వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే శక్తి కోల్పోతుందని మెడికల్ studies చెపుతున్నాయి.
ఒక మనిషి శరీరంలోకి చేరిన కరోనా వైరస్ 10 నుంచి 12 రోజులకంటే ఎక్కువగా జీవించి ఉండదని, మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ తీసుకుంటే 7 నుంచి 10 రోజుల్లోనే కరోనాను జయించిన వారు ఉన్నారు, తప్పని సరిగా తాగే నీళ్లు వేడి నీళ్లు తాగడం, ఉదయం, సాయంత్రం వాకింగ్ కానీ,ధ్యానం కానీ , యోగ కానీ చేస్తే నాలుగు, ఐదు రోజుల్లోనే సాధారణ స్థితికి వచ్చేస్తారు.
అలాగే ఉదయం, సాయంత్రం .."మిరియాలు, దాల్చిన చెక్క, సొంటి, ధనియాలతో " చేసిన powder ను వేడినీళ్లలో వేసి టీ-లాగా మగ్గబెట్టి అందులో కొంచం బెల్లం వేసి ఉదయం ఒక టీ సాయంత్రం ఒక టి చాలు.
కరోనా వచ్చింది అనగానే చుట్టు పక్కల వారు వారిని చూసి ఏదో మాయ రోగం వచ్చింది అన్నట్టుగా చూడడం మానేయండి.
కరోనా కూడా ఇతర వ్యాధుల లాంటిదే. మలేరియా, టైఫాడ్ వంటిదే. ఎవరూ వర్రీ కావద్దు. కాక పోతే జాగ్రత్తలు మాత్రం తప్పని సరిగా పాటించండి. ఈ వైరస్ మనిషి శరీరంలో గరిష్టంగా 14 రోజులకు మించి ఉండదని, ఆ తర్వాత అది నశించిపోతుందని studies చెబుతున్నారు. కాబట్టి 15 రోజుల పాటు హోమ్ కోరంటైన్ కానీ, హాస్పిటల్ కోరంటైన్ కానీ పాటించాలి. ఈ 14 రోజుల్లో మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచుకునే ఫుడ్ తీసుకుంటే కరోనా ఖతం. మందులు, ఆహారం తీసుకుంటే చాలు అని చెబుతున్నారు.
కరోనా రాకుండా సామాజిక దూరం పాటిద్దాం మాస్కులు దరిద్దాం😷😷
ప్రశ్న 9 : మన శరీరంలోని జీవకణాలు బయటినుండి సంక్రమించే వ్యాధి కారక కరోనా వైరస్ ల్లాంటి వైరస్ ల నుండి ఎలా రక్షిస్తాయి ?
జ : మన దేహంలో కోట్ల కణాలతో కూడిన అద్భుతమైన కణవ్యవస్థ వుంది .
మీరు దాన్ని గురించి తెలుసుకోవాలి .
ఎందుకంటే అది మీ చెప్పుచేతలలో వుంటూ మీ శరీరంలోకి బయటినుండి సంక్రమించే ఎలాటి వ్యాధికారక సూక్ష్మజీవులనుండైనా , కరోనా వైరస్ ల నుండైనా రక్షిస్తాయి కనుక !
మీ శరీరంలోని ప్రతి జీవకణమూ ఒక అద్భుతమైన పాత్ర పోషిస్తుంది.
అలాగే మన శరీరంలోని అన్ని కణాలూ జీవితకాలం అంతా వారానికి ఏడురోజులూ, రోజులో ఇరవైనాలుగు గంటలూ ఒకే బృందంలా పనిచేస్తాయి .
మన శరీరంలోని జీవకణాల ఏకైక కర్తవ్యం మన ప్రాణాన్నీ , ఆరోగ్యాన్నీ కాపాడడం !
మన శరీరంలో దాదాపు 84 లక్షల కోట్ల కణాలుంటాయి .
అవన్నీ నిరంతరం శ్రమిస్తూ మనకు ప్రాణం పోస్తాయి .
ఇలాంటి కణం గురించి మనకు చాలా పరిమితంగానే తెలుసు కానీ ..
మన గురించి మాత్రం మన శరీరంలోని కోటాను కోట్ల కణాల్లో ప్రతిఒక్క కణానికీ సుస్పష్టంగా తెలుసు .
మనం ఏం చేస్తున్నామో, ఏం ఆలోచిస్తున్నామో , ఏం మాట్లాడుతున్నామో ,ఏం తింటున్నామో, ఎలా ఉంటున్నామో అన్న ప్రతి ఒక్క విషయం యొక్క సమగ్ర సమాచారం వాటి దగ్గర వుంటుంది !
ఆ సమాచారానికి అనుగుణంగానే అవి ప్రతిస్పందిస్తూ వుంటాయి .
మీరు మీ శరీరాన్ని గురించి ఏది నమ్మితే మీలోని కణజాలమంతా అదే నమ్ముతుంది.
మీరేమి ఆలోచిస్తున్నా , భావిస్తున్నా అవి మిమ్మల్ని ప్రశ్నించవు .
మీ నమ్మకాలను , భావాలను , ఆలోచనలను అవి వినడం మాత్రమే చేస్తాయి .
వాటినే వాస్తవరూపం దాల్చేటట్లు చేస్తాయి.
మీకు ఏదైనా వాతావరణ పరిస్థితుల కారణంగా , సూక్ష్మజీవుల కారణంగా , వైరస్ ల కారణంగా వ్యాధి వస్తుందేమో అని భయపడితే వాటికి ఆ సందేశం అందుతుంది .
వెంటనే అవి వ్యాధి లక్షణాలను సృష్టిస్తాయి .
అలా సృష్టించడం అనేది ఆకర్షణసూత్రం మీ శరీరంలో పని చేస్తూ ఉండడమే !
వ్యాధి కారక సూక్ష్మజీవులైన కరోనా వైరస్ ల్లాంటి చొరబాటుదారులు మీ శరీరంలో ప్రవేశించినప్పుడు జ్ఞాపకశక్తికి సంబంధించిన కణాలు ఆ సూక్ష్మజీవుల , వైరస్ ల చిత్రాలను మెదడులో ముద్రిస్తాయి .
అదివరకు మన శరీరంలోకి చొరబడిన వాటికీ వీటికీ పోలిక వుందేమోనని చూస్తాయి .
వున్నట్లు తేలితే పూర్వపు చొరబాటుదారులను సంహరించిన యాంటి బాడీస్ (యాంటి సెల్స్ ) ని అంటే రక్షక కణాల బృందాన్ని పంపించి సావధానపరుస్తాయి .
ఈ రక్షక కణాల బృందం ఆ వైరసులతో పైట్ చేసి వాటిని సంహరించి మనల్ని ఆ వైరసుల బారిన పడకుండా రక్షిస్తాయి .
అయితే ఇవి కొత్త చొరబాటుదారులైతే , కొత్త వైరసులైతే వెంటనే ఒక కొత్త ఫైల్ తెరుస్తాయి .
మన శరీరంలో అన్ని యాంటీసెల్స్ ని అంటే రక్షక కణాల దళాలను అన్నింటినీ ఒకేసారి వాటిమీదకు దాడికి పంపించి ఆ వైరసుల్ని సంహరింప చేసి మనల్ని రక్షిస్తాయి.
అయితే ఏ రక్షక కణాలబృందం ఈ వైరసులను సంహరించగలిగిందో దానిని జ్ఞాపకశక్తికి సంబంధించిన కణాలు రికార్డు చేసి... పెడతాయి .
కనుక మరలా రెండవసారి అదే వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తే వెంటనే రికార్డ్ చేసి పెట్టుకున్న ఆ రక్షక కణాల బృందాన్ని , యాంటీసెల్స్ ని పంపించి వాటిపై దాడి జరిపించి , సంహరించి మనల్ని కరోనాయే కాదు ఎలాంటి మొండి వైరసుల నుండి అయినా మనల్ని సంరక్షిస్తాయి .
కరోనాపై పోరాటానికి ధైర్యము ,అవగాహనలకు మించిన ఆయుధమే లేదు .కనుక ఈ కరోనా వైరస్ పట్ల భయాన్ని వీడి ధైర్యంగా ఉందాం !
మన శరీరంలోని అద్భుతకణవ్యవస్థ పై సరైన అవగాహనను పెంచుకుందాం !!
కరోనాపై విజయం సాదిద్దాం!!
మనల్ని మనం కరోనా వైరస్ నుండి రక్షించుకుందాం !!
ప్రశ్న 10 : పంచగవ్యచికిత్స ద్వారా కరోనా వైరస్ నుండి ఎలా మనల్ని మనం రక్షించుకోగలం ?
జ : పంచగవ్యచికిత్స ద్వారా కరోనా వైరస్ నుండి మనల్ని మనం సులభంగా రక్షించుకోవచ్చు .
ముందుగా పంచగవ్యచికిత్స అంటే ఏమిటో తెలుసుకుందాం!
పంచగవ్యచికిత్స అంటే దేశీ ఆవు యొక్క మూత్రం , మయం , పాలు , పెరుగు , నెయ్యిలతో చేసే సహజచికిత్సనే పంచగవ్యచికిత్స అంటారు.
ఈ పంచగవ్యచికిత్స ద్వారా కరోనా వైరస్ ని ఎలా ఎదుర్కోవచ్చో అందరికీ అవగాహన కల్పించడం కోసం, సరళంగా అర్ధం అవ్వడం కోసం కోవిడ్ కి ....... మనిషికి మద్య జరిగిన సంభాషణ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను శ్రద్ధగా చదివి అవగాహన చేసుకోండి .!
స్వయంగా పంచగవ్యచికిత్సను అవలంబించండి !!
కరోనా వైరస్ పై విజయం సాధించండి !!
ఇప్పుడే ఆ సంభాషణ ఎలా జరిగిందో చూద్దాం
----------------------------------------------------
" కోవిడ్ కి మనిషి కి మద్య సంభాషణ"
-------------------------------------------------------
కోవిడ్ : "నేను లోపలికి రావచ్చా?"
మనిషి : "అరే... కోవిడ్ నువ్వా? నేను నీ కోసమే ఎదురు చూస్తున్నాను"
కోవిడ్ : "నా కోసం ఎదురు చేస్తున్నావా?"
"నువ్వు నన్ను చూసి భయపడలేదా?"
మనిషి : ముసలి దానివి అయిపోయావు, నిన్ను చూసి ఎవరు భయపడతారు? అయినా నువ్వంటే నాకు చాలా గౌరవవం, ఎందుకంటే.. ఎప్పుడూ లేనిది నీ వల్లే ఈ ప్రపంచం స్తంభించింది, నీ వల్లే పర్యావరణ కాలుష్యం తగ్గింది , వాతావరణ శుద్ధి జరిగింది.
ప్రపంచానికి భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేసావు.
నమస్కారం అనే మన సంస్కారాన్ని నేర్పించావు , ఇంట్లో కి వచ్చే ముందు కాళ్ళు, చేతులు కడుక్కోవడం నేర్పించావు.
తులసి, నిమ్మకాయ, ఆయుర్వేదం, గోవు యొక్క పంచ గవ్యాల విలువ ప్రపంచానికి తెలిసేలా చేసావు.
అందుకే..నువ్వంటే నాకు ఎప్పుడూ గౌరవమే."
కోవిడ్ : "నేను, ముసలి దానిని అయిపోయినా ప్రాణాలు తీయగలను"
మనిషి : "ఏంటి! నువ్వా? వయస్సు లో ఉన్నప్పుడే తీయలేకపోయావు, ఇప్పుడు ఇంకేం తీస్తావు?" అనగానే.......
"అమాంతంగా కోవిడ్ అతని శరీరం లోకి ప్రవేశించింది.."
5 రోజుల తరువాత..
కోవిడ్ : "చూసావా? నీకు 102.5 డిగ్రీల జ్వరం వచ్చింది"
మనిషి : "4 రోజుల నుండి జ్వరం 99 కి దగ్గర లొనే ఉంది, నేను అనుకుంటే ప్రతి రోజు రాత్రి పూట గోల్డెన్ మిల్క్ అంటే 200ml నాటు ఆవు పాలల్లో మరిగిస్తూ అందులో అర చెంచా పసుపు తో పాటు 2 చెంచాల నెయ్యి వేసి బాగా తురిమి ఆ వేడి పాలను పడుకునే ముందు నుంచుని త్రాగుతాను.
దీని వల్ల అరుగుదల శక్తి పెరుగుతుంది, జ్వరమే కాదు , తలపోటు , గ్యాస్, అసిడిటీ, మోకాళ్ళ నెప్పులు తగ్గడం తో పాటు ఇమ్మ్యూనిటి పవర్ కూడా పెరుగుతుంది.
ఇప్పటికైనా మించిపోయింది లేదు నీకు నా కాళ్ళు పట్టుకునే అవకాశం ఇస్తున్నాను.
క్షమాపణలు అడిగి వెళ్లిపో.
కోవిడ్ : "ఏంటి, ప్రపంచం అంతా భయం తో నన్ను చూసి గజ గజా ఒణికిపోతుంటే నన్నే నీ కాళ్ళు పట్టుకోమంటావా?
సరే చూద్దాం ఎవరు గెలుస్తారో...?"
కోవిడ్ : "చూసావా? నీలోకి దూరి నీ ఆకలిని చంపేసాను, నీకు విపరీతంగా నిద్ర వస్తుంది, నీ పనులన్నీ ఆగిపోయాయి,
1-2 రోజుల్లో దగ్గు, రొంప వస్తాయి, ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైపోతుంది.
మీ ఇంట్లో వాళ్ళు బలవంతంగా నీకు టెస్ట్ చేయిస్తారు,
తరువాత నిన్ను హాస్పిటెల్ కు తీసుకువెళ్తారు...
అక్కడ నీ అడ్రస్ గల్లంతు అవ్వవచ్చు లేదా నీ జేబు ఖాళీ అవ్వవచ్చు.
అప్పుడు నువ్వు ఒడిపోతావు.
హ..హ..హ..
మనిషి : "యుద్ధం యొక్క ప్రధమ నియమం- ఏకాగ్రత. నా ప్రకృతి నా లోని మొత్తం శక్తి నీపై విజయం సాధించదానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
లంకణం పరమ ఔషధం.. ఆకలి మందగించడం వల్ల వచ్చిన జ్వరం దానంతట అదే తగ్గిపోతుంది, ఇంక నిద్ర అంటావా నా శరీరాన్ని రీఛార్జి చేస్తుంది.
నేను ప్రతిరోజు ఆవుపెరుగుని పలచిని మద్యగగా చిలికి నిమ్మరసం అల్లం , జీలకర్ర కలుపుకుని సేవిస్తాను .
మద్యగలో ఉండే లాక్టోజ్ బ్యాక్టీరియా నీపై దాడి చేసి నిన్నే ఆహారంగా తినేస్తుంది .
నా ఆకలిని శాంతింపజేసి జ్వరాన్ని తగ్గిస్తుంది మరియు నీకు బైట నుండి లభించే శక్తి ని ఆపుతుంది.
కోవిడ్ : చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు, కొద్ది సేపటికి తలపోటు మొదలవుతుంది.
మెదడు పనిచేయడం ఆగిపోతుంది.
మీ ఇంట్లో వాళ్ళు భయానికి లోనవుతారు.
నువ్వు భయపడకపోతే ఏమవుతుంది?
చుట్టూ ప్రక్కల అంతా భయమే భయం. ఇంక నీ పని అయిపోయినట్లే...హ..హ..హ.
మనిషి : "వారి భయాన్ని తొలగించడానికే హోమియోపతి డాక్టర్ దెగ్గరకు వెళ్లి మందులు తెచ్చుకుని వాడుతున్నాను. ఇలా 3-4 రోజులు గడిచిపోతాయి.
కోవిడ్ : "ఈ తీపి-తీపి బిళ్ళలు నన్నేమి చేయలేవు."
మనిషి : "నీ కోసం అయితే ఇవి చాలు"
కోవిడ్ : " నువ్వేం త్రాగుతున్నావు"
మనిషి : " అమృతజలం
కోవిడ్ : " ఇప్పటి వరకు ఊరికే ప్రగల్భాలు పలికావు, చనిపోతావని భయం వేసి గంగా జలాన్ని త్రాగుతున్నవా?"
మనిషి : "ఇది గంగాజలం కాదు దీనిని గోమూత్రం అర్క్ అంటారు ఈ అమృతజలం నా కోసం కాదు నిన్ను చంపడం కోసం."
కోవిడ్ : "అంటే ఏమిటి?"
మనిషి : "చనిపోయే ముందు గంగా జలాన్ని సేవించడం విజ్ఞానం కాదు, ప్రతి రోజు అమృతజలాన్ని (గోమూత్రం అర్క్ )సేవించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల తో జీవించడం విజ్ఙానం.
మనుష్యులు ఈ విజ్ఞానాన్ని ఎప్పుడో మరచిపోయారు.
అమృతజలం గోమూత్రం అర్క్ 90% రోగాలను నాశనం చేస్తుంది."
కోవిడ్ : "నువ్వు డ్రాప్లెర్ తో ముక్కు లో ఏమి వేసుకుంటున్నావు?"
మనిషి : "ఇది మా భారతీయ గోవు యొక్క తాజా నెయ్యి ! దీని వల్ల రొంప, ముక్కు కారడం ఆగిపోతాయి. చీముడు ఏమైనా ఉన్నా కరిగిపోయి బైటకు వచ్చేస్తుంది. తలపోటు తగ్గిపోతుంది."
కోవిడ్ : "నీకు తెలుసా? నేను నీకు సోకి 5 రోజులు దాటిపోయింది. 5 రోజులు దాటితే నేను నీ ఊపిరి తిత్తుల్లోకి చేరుకుంటాను. నా అసలు ఆట ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు నువ్వు గోమూత్రం అర్క్ త్రాగితే , ఆవునెయ్యి ముక్కులో వేసుకుంటే ఏమవుతుంది?
అదేంటి... నాకు ఊపిరి ఆడడం లేదు?"
ఇదేమిటి?
దీపం వెలిగించి ఉంది?
అవును లే.. హిందువులు చనిపోయే ముందు దీపం వెలిగిస్తారు కదా?..హ...హ..హ.
మనిషి : "ఇది, నీ చావు కోసం వెలుగుతున్న దేశీయ గోమాత నెయ్యి యొక్క అఖండ దీపం. దీని వల్ల ఇల్లంతా ప్రాణశక్తి తో నిండిపోతుంది దీని వల్ల నువ్వు మా కుటుంబం లో వేరెవ్వరి మీద ఆక్రమణ చేయలేవు. దీని వల్లే నీకు ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది."
కోవిడ్ : " నువ్వు చెప్తుంది నిజమే, ఇప్పుడు నేను కొంచం సేపు కూడా ఉండలేకపోతున్నాను. నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను గాని, ఏదొక రోజు మళ్ళీ తిరిగి వస్తాను.అప్పుడేం చేస్తావు?
మనిషి : నువ్వే కాదు, నీలాంటి వెయ్యి రెట్లు శక్తివంతమైన వైరస్లు వచ్చినా నన్నేమి చేయలేవు. నేను ప్రతి రోజు గోమయి పిడకలను వెలిగిస్తాను..ఇలా వెలిగించడం వల్ల రేడియేషన్ తగ్గుతుంది, నెగిటివ్ ఎనిర్జీలు తగ్గుతాయి, ఇంట్లో ఎటువంటి వైరస్ నిలవలేదు. ఆ పిడకలను వెలిగించగా వచ్చిన భస్మాన్ని 20 లీటర్ల నీటి లో 2 చెంచాలు వేసి, అర చెంచా పసుపు వేసి త్రాగితే నీరు శుద్ధి అవడమే కాకుండా శరీరానికి కావలసిన అన్ని రకాల పోషక తత్త్వాలు లభిస్తాయి .
కోవిడ్ : ఇంతటి విజ్ఞానాన్ని నువ్వు ఎక్కడ నుండి సంపాదించావు?
మనిషి : ఇది మా ఋషుల ప్రపంచానికి అందించిన అద్భుత విజ్ఞానం, వీరు ఆరోగ్యం పేరుతో వ్యాపారం చేయలేదు. నువ్వు మొదటి నుంచే చేతకాని దానివి అయినా నీ గురించి భయాన్ని కలిగించి కోట్ల రూపాయల వ్యాపారం మొదలయ్యింది.
మా ఈ విజ్ఞానం ప్రచారం జరిగిన తరవాత ఎంతటి భయంకరమైన వైరస్లు వచ్చినా మమ్మల్ని ఏమి చేయలేవు. ముఖ్యంగా మా భారత దేశాన్ని.
పూర్వం యుద్దాలంటే...... రణరంగం లో కత్తులు, కటారులు, ఏనుగులు, అశ్వాలతో సైనిక బలగాల మధ్య మాత్రమే రాజ్యాల కోసం జరిగేవి. తరువాత తుపాకులు, బాంబుల తో సరిహద్దులలో జవానుల మధ్య దేశం కోసం జరిగేవి, గాని నేడు, బయో వార్స్ (వైరస్ లతో యుద్దాలు) మొదలయ్యాయి. ఎవరికి వారు వారి మనుగడ కోసం యుద్ధాన్ని చేయవలసిన పరిస్థితి ఏర్పడింది.
మహర్షి వాగ్భటుల వారు చెప్పినట్లు పంచగవ్యాలను , వంట ఇంటి లో ఉండే ఆహారాన్నే ఓౌషధంగా స్వీకరిస్తూ ఉంటే ఎటువంటి వైరస్ కానీ , రోగం కానీ మన దరిచేరదు.
ప్రశ్న 11 : కరోనా.. ఒక పెద్ద కుట్ర అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ?
జ : కరోనా వైరస్ అనేది ఒక పెద్ద కుట్ర ! ఇది వాస్తవమా ? అవాస్తమా తెలుసుకోవాలంటే ఈ విషయాలను శ్రద్ధగా చదవండి .
(ప్రపంచాన్ని సర్వనాశనం చేసిన దుర్మార్గుల గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి)
అన్నిటికంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది..
ఈ ప్రపంచంలో అన్ని సమస్యలకూ మూల కారణం..
పెట్టుబడిదారీ వ్యవస్థ.
ఇది అర్థం అయితే తప్ప మనకు ఏదీ సరిగా అర్థం కాదు.
ఇప్పుడు ప్రపంచం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయింది.
ఇంతటి విశాల ప్రపంచంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, వాతావరణపరంగా, జీవనశైలిలో, ఆచార వ్యవహారాల్లో, ఆహారపు అలవాట్లలో ఇంకా అనేక విషయాల్లో.. ఒకదేశంతో మరొక దేశానికి చాలా వ్యత్యాసం ఉంటుంది.
అన్ని దేశాలలో ఒకే రకమైన పరిస్థితి అనేది మానవుడు సృష్టిస్తే తప్ప..
సహజసిద్ధంగా వచ్చే అవకాశం ఉండదు.
ఇప్పుడు ఈదేశం..
ఆదేశం అనే తేడా లేకుండా..
ప్రపంచం మొత్తం విషవలయంలో చిక్కుకుపోయింది.
చిక్కుకుంది..
అనే కంటే ఛేదించలేని వలయాన్ని సృష్టించారు అనడమే కరెక్ట్.
మానవ సమాజం అనేకసార్లు ఈ కరోనా కంటే వందరెట్లు భయంకరమైన సూక్ష్మజీవులనూ.. రోగాలనూ ఎదుర్కొని పోరాడి నిలిచింది.
కానీ సాంకేతికంగా.. వైజ్ఞానికంగా.. ఎంతో అభివృద్ధి.. ఆరోగ్య పురోగతి సాధించిన ఈ రోజుల్లో.. ఇంత బలహీనమైన వైరస్ కి ( మరణాల రేటు 3% మించిలేని వైరస్ భయంకరమైనది అనడం అవివేకం. ఆ మరణాలలో కూడా 50% పైగా కేవలం వీరు సృష్టించిన భయంతో చనిపోయినవారే )
మానవజాతి సమస్తం ఛిన్నాభిన్నం అయ్యిందంటే..
దీని వెనక కచ్చితంగా కుట్ర దాగి వుందనుకోవడంలో ఏ సందేహం ఉండాల్సిన అవసరం లేదు.
కానీ......
ఇమ్యూనిటీ పెంచే ఊసే లేదు
ఎందుకంటే .........
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మార్క్స్ ఏనాడో చెప్పాడు.
ముఖ్యంగా పెట్టుబడిదారీ వ్యవస్థకు లాభాలు తప్ప మరో ఆలోచన ఉండదు.
డబ్బుకోసం ఎంత నీచానికైనా దిగజారుతారు.
కోవిడ్ మాత్రమే కాదు..
సూక్ష్మజీవుల వల్ల వచ్చే ఏ రోగానైనా మన శరీరం ఇమ్యూనిటీతోనే ఎదుర్కుంటుంది.
మరి ప్రజల్లో ఇమ్యూనిటీని పెంచే దిశగా ఏ దేశం అయినా చర్యలు చేపడుతోందా.?
అబ్బే అసలు ఆ ఊసే లేదే !
ఎవరి నోట విన్నా.. వ్యాక్సీన్, వ్యాక్సీన్, వ్యాక్సీన్.
తొందరగా వ్యాక్సీన్ రావాలి.
ప్రతీ ఒక్కరూ తీసుకోవాలి.
అప్పుడు కానీ.. ఈ కరోనాని తరిమికొట్టలేము అనే భయంకరమైన వాతావరణం క్రియేట్ అయ్యింది.
మొన్న ఆ మధ్య WHO చేసిన ప్రకటన చూస్తే నవ్వొచ్చింది.
చాలా మందిలో కరోనా ఉన్నప్పటికీ అసలు ఏ లక్షణాలూ కనిపించట్లేదట.
ఇలాంటి వారి ద్వారా వైరస్ ఎక్కువగా వ్యాపించే ప్రమాదం ఉందని పాపం WHO బెంగపడిపోతోంది.
అసలు లక్షణాలు కూడా బయటపడకుండా తగ్గిపోయే జబ్బు ప్రమాదకరం ఎలా అవుతుందో.!
ఇలాంటి జబ్బుకి వణికిపోతూ ప్రపంచం అంతా లాక్డౌన్ ఎందుకు విధించిందో WHO చెప్పగలదా.?
చెప్పలేదు.
ఎందుకంటే ఈ కుట్రలో WHO కూడా భాగం పంచుకుంది కాబట్టి.
కుట్రలో ఎవరెవరు.? దీని వల్ల వారికి లాభం.ఏమిటి ?
ఇది తెలుసుకునే ముందు మనం డాక్టర్ శివ అయ్యాదొరై గురించి కొంచం తెలుసుకోవాలి.
డాక్టర్ శివ ఇండియన్ అమెరికన్ సైంటిస్ట్.
అమెరికాలోని MIT University లో Biological Engineering లో Ph.d. చేశారు.
immunology మీద మంచి పట్టున్న ఈ మేధావి కాలిఫోర్నియాకి చెందిన డాక్టర్ Anna Lorraine అనే మరో సైంటిస్ట్ తో కలిసి అమెరికాలో fake Science కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.
వీళ్ళు Anti Vaccine Activists.
ముఖ్యంగా కరోనా విషయంలో లాభాల కోసం ప్రపంచాన్ని సర్వనాశనం చేసిన స్వార్థపరుల గుట్టుని రట్టుచేసి, ప్రజలను చైతన్యపరిచేందుకు ఆయన ఆమెరికాలో ఉద్యమాన్నే నడుపుతున్నారు.
డాక్టర్ శివ ప్రకారం ఈ వినాశనానికి కారణం.
1. Bill Gates (Micro soft CEO),
2.Dr. Fauci (USA Chief Medical Advisor)
3. WHO
ఇంకా.. Dr.Fauci allies - Big Pharma, Clinton global Initiative, Chan - Zuckerberg, CDC.
బిల్ గేట్స్ మెడికల్ రంగానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి.
కానీ ఏ దేశంలో కొత్తగా ఏ రోగాలు పుట్టుకొచ్చినా.. సేవ ముసుగులో అక్కడ ప్రత్యక్షమై వాటికి టీకాలు సిద్ధం చేసి బిలియన్ల డాలర్లు మూటగట్టుకునే వ్యక్తి.
గేట్స్ ఫౌండేషన్ 2010 లో అమెరికాకు చెందిన National Institute of Allergy and Infectious diseases (దీనికి డైరెక్టర్ Dr.Fauci), WHO తో కలిసి గ్లోబల్ వ్యాక్సీన్ ప్రాజెక్ట్ కోసం CEPI (Coalition for epidemic Preparedness Innovations) అనే సంస్థను స్థాపించారు.
ప్రతీ దానికీ వ్యాక్సీన్ తయారు చేసి మార్కెట్లో పెట్టడమే ఈ సంస్థ ఉద్దేశం.
విచిత్రమేమంటే..
ఈ సంస్థ MERS -Cov, SARS - Cov - 2, Nipah virus, Lassa fever virus, Rift Valley virus, Chikunguniya లాంటి వాటికి వ్యాక్సీన్ మాత్రమే కాదు..
ఇంత వరకు అసలు తెలియని ఫ్యాథోజన్ అసలు ఉనికిలో లేని దాని కోసం కూడా "Disease X" పేరిట వ్యాక్సీన్ తయారీకి పూనుకుందంటే ఈ సంస్థ దేనికోసం పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
బిల్ గేట్స్ HIV విషయంలో కూడా తప్పుడు సైన్స్ ని ప్రచారం చేసి.. HIV కచ్చితంగా AIDS కి దారితీస్తుందనే భయాన్ని కలిగించి ACTI, IV drugs ప్రజలకు ఇచ్చేవారని.. దీనివల్ల శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిని చాలామంది చనిపోయారని శివ ఆరోపిస్తున్నారు.
అసలు వ్యాక్సిన్ అనేది అవసరమైతే తప్ప తీసుకోకూడదని..
ఆహారంతోనే (విటమిన్లతోనే) వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలని..
ఈ విషయం వైద్యరంగానికి చెందిన Dr. Fauci కి బాగా తెలుసని..
కానీ డబ్బుకోసం ఫేక్ సైన్స్ ప్రచారం చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని శివ అంటున్నారు.
ఇదే విషయాన్ని ఆయన ట్రంప్ కి రాసిన లెటర్లో పేర్కొన్నారు.
కనీసం ఇప్పుడైనా ఈ కరోనా పరిస్థితిలోనైనా అసలైన సైన్స్ ని ప్రజలకు చెప్పండి..
ఇమ్యూనిటీకి సంబంధించి నిజాలను ప్రజలకు చెప్పి భయాన్నిపోగొట్టండని ట్రంప్ కి సూచించారు.
కోవిడ్ని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవచ్చో..
ఆయన కొన్ని పాయింట్లను లెటర్లో పేర్కొన్నారు.
ఇవి చాలా సింపుల్ గా ఉన్నాయి.
డాక్టర్ Anna Lorraine కూడా ట్రంప్ కి రాసిన లెటర్లో ఇప్పుడు ప్రపంచం ఫాలో అవుతున్న పద్ధతి కరెక్టని ఫార్మాకంపెనీలతో సంబంధంలేని తమకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలూ లేని సైన్స్ ఎక్స్ పర్ట్స్ ఒక పది మందితో చెప్పించండని.. చూద్దాం అని సవాలు విసిరారు.
గుడ్డిగా నమ్మేస్తున్నారు
ఇప్పుడు ప్రతిఒక్కరూ డాక్టర్లు అయిపోయారు.
ఎవరకిి తోచింది వారు చెప్పేస్తున్నారు.
చాలా వాటిని గుడ్డిగా నమ్మేస్తున్నాం. కానీ, ఎపిడెమాలజిస్టులు..
ఎక్స్ పర్ట్స్ చెబుతున్న మాటలు మాత్రం ఎవ్వరూ పట్టించుకోవట్లేదు.
ఈ వైరస్ కి ఎక్స్ పోజ్ కాకుండా దాక్కోవడం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా మరింత జటిలం అవుతుందని ప్రముఖ ఎపిడెమాలజిస్ట్ డాక్టర్ జయప్రకాష్ ముల్లియర్ చెప్పారు. Dr.శివ అయ్యాదొరై కూడా అదే చెబుతున్నారు.
కానీ, నిపుణుల గోడు వినే పరిస్థితిలో ఇప్పుడు ప్రపంచం లేదు.
ప్రపంచం బిల్ గేట్స్ కనుసన్నలలోనే నడుస్తోంది.
భారతదేశాన్ని అంబానీ ఎలా శాసించగలడో..
ప్రపంచాన్ని బిల్ గేట్స్ అలా శాసించగలడు.
ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) అతడు చెప్పినట్టే వినాలి .
అతన్ని కాదని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి అక్కడ లేదు అని వైట్ హౌస్ కరెస్ఫాండెట్ ప్రకటించింది.
ఆయన ఇప్పటికే వ్యాక్సీన్ తయారీ కోసం 7 లాబ్స్ నిర్మించి సైంటిస్ట్లను ఆ పనికి ఎప్పుడో పురమాయించాడని.
ఇప్పుడు ఆ వ్యాక్సీన్ మార్కెట్లోకి వస్తేనే.. ఈయన గారికి బిలియన్ బిలియన్ డాలర్ల లాభం వస్తుందని ఆవిడ చెప్పారు. అందులో Dr.Fauci లాబ్ ఒకటి.
ప్రపంచంలో మరే దేశం వారు కోవిడ్ కి వ్యాక్సీన్ కనిపెట్టినా దాన్ని మార్కెట్లోకి రాకుండా..
వీళ్ళది మాత్రమే వచ్చేలా చూసుకోవాల్సిన పని కూడా.. వీళ్ళ మీద పడింది.
బిల్ గేట్స్ పెద్ద జోతిష్కుడు.!
........................................
బిల్ గేట్స్ 2015లో టెడ్టాక్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో..
రాబోయే 3,4 సంవత్సరాల్లో అతి భయంకరమైన వైరస్ ఒకటి రాబోతోందని..
దీంతో 6 నెలల్లోనే.. 3 కోట్ల మంది చనిపోతారని చెప్పాడు.
దీనికి వ్యాక్సీన్ కనిపెట్టడంలో వాళ్ళ సంస్థ నిమగ్నమై ఉందని.. భారీగా విరాళాలు కావాలని చెప్పాడు.
ఆయన భార్య మిలిందా గేట్స్ కూడా ఇదే మాట చెప్పింది.
ఆ వైరస్ అతి భయంకరమైందని.. అది అంత తొందరగా పోదని, వ్యాక్సీన్ తప్పనిసరి అని చెప్పింది.
ఇప్పుడు వచ్చిన కోవిడ్ 19 అదే.
మరి ఈ విషయం వీళ్ళకు అన్ని సంవత్సరాల ముందుగానే ఎలా తెలిసింది.?
వైరస్ రాకముందే వ్యాక్సీన్ ఎలా కనిపెట్టాలనుకున్నారు.?
వీటికి సమాధానం కొంచం బుర్రపెడితే.. ప్రతీ ఒక్కరికీ ఈజీగానే అర్థం అవుతుంది.
వీళ్ళు అనుకున్నట్టు లాభాలు రావాలంటే.. ప్రపంచంలో ఉన్న ప్రతీ ఒక్కరూ వ్యాక్సీన్ తీసుకోవాలి.
చిన్నా చితకా జబ్బులకు టీకా తీసుకోవాలని సామాన్యులు అనుకోరు.
అందుకే ఇంతటి భయంకర వాతావరణం.
ప్రపంచం అంతా లాక్డౌన్.
ట్రంప్ అయినా, జాన్సన్ అయినా మరే పెట్టుబడిదారీ దేశమైనా బిల్ గేట్స్ చెప్పినట్లు నడుచుకోవాల్సిందే.
అందుకే Dr.Fauci అమెరికా ప్రజల్ని, ప్రభుత్వాన్నీ తప్పుదారి పట్టించాడు.
ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తున్నాడు.
ఈయనకు ట్రంప్ సపోర్ట్ ఉంది.
కానీ, ఇప్పుడు ట్రంప్ అనుచరులే ఫౌసిని తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ట్రంప్ కొంచం తగ్గక తప్పని పరిస్థితి.
చనిపోవడం మంచిదే.!
.........................
ఇంకా భయంకరమైన విషయమేమంటే..
బిల్ గేట్స్ depopulation గురించి మాట్లాడ్డం.
ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది కాబట్టి ఇలాంటి వైరస్ లు వచ్చి చాలా మంది చనిపోతే (ప్రపంచ జనాభాలో సగం మంది. అది కూడా పేద ప్రజలు) చాలా మంచిది అని చెప్పాడు.
అంతేకాదు, వీళ్ళ వ్యాక్సీన్లలో కొన్ని రకాల మందులు వాడుతున్నారట..
వాటి వల్ల ఫర్టిలిటీ రేట్ (సంతానాన్ని పొందే సామర్థం) గణనీయంగా తగ్గిపోతుందట.
ఇలా depopulation పనులు చేపట్టారని (ఆ మందులు పరీక్షిస్తే తెలుస్తుందని) డా.శివ అయ్యా దొరై అంటున్నారు.
ప్రాణాంతకం కాదు
...................
కరోనా అనేది.. అతి సాధారణమైన జలుబు, జ్వరం లాంటి చిన్న జబ్బు.
కొందరి స్వార్థం కోసం దీన్ని పెద్ద భూతాన్ని చేసి.. భూతద్దంలో చూపిస్తున్నారు.
ఇతర జబ్బులు ఏమీ లేకుండా, ఒక ఆరోగ్యవంతుడు కేవలం ఈ వైరస్ సోకి చనిపోయిన కేసు ఒక్కటి కూడా లేదు.
జబ్బుకంటే భయంతోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి.
కరోనా పాజిటివ్ అని తెలియగానే చాలామంది ఇక చావు తప్పదని వణికిపోతున్నారు.
భయంవల్ల స్ట్రెస్ విపరీతంగా పెరిగి శరీరంలో ఇమ్యూన్ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది.
లక్షలాది మంది చాలా తేలికగా దీని నుంచి బయటపడుతున్నారు.
కోవిడ్ పట్ల అవగాహన పెంచుకుని ధైర్యంగా ఉంటే.. వారిలో మనం కూడా తప్పకుండా ఉంటాం.
కేవలం వయసు పైబడిన, రిస్క్ ఉన్నవారి మీద దృష్టి పెట్టి (మన దేశంలో వృద్ధుల సంఖ్య పది శాతానికి మించిలేదు) ప్రభుత్వం వారిని కాపాడడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే..
రిస్క్ గ్రూప్ లో కూడా మరణాలు చాలా తగ్గించే అవకాశం ఉండేది.
కానీ మనవి పెట్టుబడిదారీ ప్రభుత్వాలు కదా..
వాళ్ళ కోసమే పనిచేస్తాయి.
మన కోసం కాదు.
మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.
అవగాహన.. ధైర్యానికి మించిన ఆయుధం లేదు.!
- రాంకర్రి జ్ఞాన కేంద్ర
8096339900
- స్వస్తీ...