శాశ్వతంగా నిద్రపోయిన తర్వాత ఎంత గొప్పగా బతికినా శవం అనే అంటారు, 

సమయం మించకుండా తీసేయండి అని పెద్దలు అంటారు. 

భార్య గుమ్మం వరకు, కొడుకు కాటి వరకు వచ్చి కర్మ చేసి వెళ్లిపోతారు.. 

అప్పుడు మొదలు అవుతుంది ఆత్మ ఘోష 

నా భార్య నా పిల్లలు నా ఇల్లు అని గుండెలు బాదుకుంటూ ఆ ఇంటికే వెళ్తాడు.

అతను ఎవరికీ కనిపించడు వినిపించడు 

ఇది నా ఇల్లు నా వస్తువులు నా ఆస్తి అని నిన్నటి వరకు కాపాడుకున్న ఏది నాతో తీసుకుని వెళ్లలేకపోయానే.. 

వీటి కోసమా జీవితం అంతా కష్టపడ్డాను.. 

అని ఏడుపు మొదలు అవుతుంది.. 


గుండె పగిలేలా ఏడుస్తున్న భార్యను చూసి, 

ఉన్నన్ని రోజులు ఎదో సాకుతో సాధించాను 

కాస్త ఓపికగా ప్రేమగా ఉంటే బాగుండేది 

ఇప్పుడు ఓదార్చే శక్తి కూడా లేదు..

అని అప్పుడు అనిపిస్తుంది.  


కుటుంబ సభ్యులను చూసుకుని చేసిన పోరబాట్లు గుర్తు చేసుకొని 

ఒక్కసారి భగవంతుడు బతికిస్తే అందరికి క్షమాపణ చెప్పుకుని మళ్ళీ నీ దగ్గరకు వస్తాను తండ్రి అని ఆత్మ ఘోషిస్తుంది, 

చిన్న చిన్న తప్పులను క్షమించి అందరితో సంతోషంగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. 


ఎక్కడైతే వదిలేసారో అదే స్మశానానికి తిరిగి వెళ్లి అక్కడ ఒంటరిగా రోదిస్తూ భగవంతుడా అని పిలవ గానే 

ఓ స్వరం వినిపిస్తుంది 

నేను నీకు తోడుగా ఇక్కడే ఉన్నాను భయపడకు అని, 

ఎవ్వరూ రాని చోటికి ఏ దిక్కు లేని చోట కూడా నీ కోసం శివుడు ఉన్నాడు

అప్పుడు కనిపిస్తాడు దేవుడు.  


అప్పటివరకు ఆత్మఘోషతో రోదిస్తున్న ఆత్మ ఏమైయ్యా బతికి ఉండగా ఎన్నిసార్లు పిలిచి ఉంటాను..

ఎంత మొక్కి ఉంటాను ఏనాడైన ఇలా వెంటనే పలికావా ఇప్పుడు మటుకు ప్రత్యక్షం ఐయ్యావు అని అడుగుతుంది ఆత్మ. 

అప్పుడు శివయ్య అంటాడు నేను నువ్వు పిలిచిన ప్రతి సారి పలుకుతూనే ఉన్నాను

కానీ నువ్వు వినలేక పోయావు 

నువ్వు ఒకసారి పిలిస్తే నేను 108 సార్లు పలుకుతాను అది నీకు వినపడాలి అని. 

కానీ నువ్వు బతికి ఉన్నంత కాలం నేను నాది అనే మాయలోనే ఉన్నావు.. 

ఇప్పుడు నీదంటూ ఏమీ లేదు అన్న సత్యాన్ని గ్రహించావు కనుకే నా మాట వినగలిగావు.. 

స్మశానంలో కూడా నీకు తోడుగా ఉన్న నేను ఎప్పుడూ నీ పక్కనే ఉన్నాను. 

నీ ప్రతి కష్టంలోనూ తొడుగానే ఉన్నాను, 

ఆ కష్టాన్ని దాటిస్తూనే ఉన్నాను...

కానీ అదంతా నువ్వు నీవే చేస్తున్నావు అనుకున్నావు 

కనుక నన్ను గుర్తించలేక పోయావు.. 

నువ్వు వచ్చే టప్పుడు 

నువ్వు పోయే టప్పుడు 

నీ తో వస్తున్నది నీ కర్మ మటుకే 

ఇంక ఏదీ నీతో రాదు అని శివయ్య చెప్పాక.. 


ఏది శాశ్వతం కాదు అని గ్రహించిన ఆత్మ శాంతించి వెళ్ళిపోతుంది. 

ఋణ బంధం ఉన్నంత వరకే ఈ జీవితం.. 

దేహం తట్టుకునే వరకే ప్రాణం 

తట్టుకోలేని స్థితిలో దేహం ఉంటే పోతుంది ప్రాణం

ఇంకో కొత్త దేహాన్ని వెతుకుంటుంది 

ప్రాణమే అలా ఉన్నప్పుడు ఇంక ఋణానుబంధాలు ఎలా ఉంటాయో ఆలోచించండి.


హర హర మహాదేవ...



- స్వస్తీ...