శ్రీ కృష్ణని మరోరూపం హరిదాసు
సంక్రాంతి ముందు ధనుర్మాసం లో మాత్రమే వీళ్ళు కనపడతారు మళ్ళి సంవత్సరం దాకా రారు . . .
శ్రీ మహవిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు . . .
హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే
మన తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగి పోతాయి . . .
హరిదాసు అనగా పరమాత్మతో సమానం . . .
మనుషులు ఇచ్చే దానధర్మాలు అందుకుని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగలని దీవించేవారు హరిదాసులు . . .
నెలరోజులు పాటు హరి నామాన్ని గానం చేసినందుకు
చివరి రోజున స్వయంపాకానికి అందరూ ఇచ్చే ధన, ధాన్య, వస్తు దానాలను స్వీకరిస్తారు . . .
హరిదాసులు తమ తలపై ధరించే పంచలోహ పాత్రను సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర గా భావిస్తారు . . .
ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు . . .
ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమి మాట్లాడరు . . .
అక్షయపాత్రను దించరు . . .
ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి, అక్షయపాత్రను దించుతుంది . . .
శ్రీకృష్ణునికి మరోరూపం హరిదాసులని అంటారు పెద్దలు . . .
గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి,
హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీ మహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం . . .
హరిదాసు పేద, ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు . . .
ఎవరి ఇంటి ముందు ఆగడు . . .
' శ్రీ మద్రమారమణ గోవిందో హరీ ' అంటూ . . .
ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు.
గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు . . .
అందుకే గ్రామాలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మాలలో ధాన్యం / బియ్యం తో సిద్ధంగా ఉంటారు . . .
అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీమహా విష్ణువుకు కానుకగా బహుకరించినట్లుగా భక్తులు భావిస్తారు . . .
హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీమహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది . . .
హరిదాసులు సామాజిక సంరక్షకులని చినజీయర్స్వామి అన్నారు . . .
శ్రీరామానుజాచార్యులు చూపిన బాటలో వీరంతా పయనిస్తున్నారని పేర్కొన్నారు . . .
హరిదాసు వస్తే ఎన్ని పనులు ఉన్నా ఇంటి ముందుకు వచ్చి అక్షయ పాత్రలో బియ్యం పోయండి . . .
మన ఆచారాలను మనమే కాపాడుకోవాలి,
మన ధర్మాన్ని మనమే కాపాడు కోవాలి .
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
స్వస్తీ . . .