కార్తీక పురాణం - 28 వ అధ్యాయము


విష్ణు సుదర్శన చక్ర మహిమ


           జనక మహారాజా! వింటివా దుర్వాసుని అవస్ధలు! తాను యెంతటి కోపవంతు డైనను,వెనుక ముందు ఆలోచింపక మహాభక్తుని శ్రద్దని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్ప వారైనాను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోన వలెను.
             అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణునికడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపదుచూతిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి " అంబరీషా,ధర్మ పాలకా!

         నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము,నీకు నా పైగల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్నాహ్వనించితివి,కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రత భంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయతలపెట్టితిని.
             గాని నా దుర్బద్దినన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్దమైనది.నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపదనుండి రక్షింపుమని ప్రార్ధి౦చితిని.
 ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానో దయము చేసినీ వద్ద కేగమని చెప్పినాడు.కాన నీవే నాకు శరణ్యము.

              నేను యెంతటి తపశ్శాలి నైనను, యెంత నిష్ట గలవాడ నైనను నీ నిష్కళంక భ క్తి ముంద వియేమియు పనిచెయలేదు. నన్ని విపత్తు నుండి కాపాడు " మని అనేక విధాల ప్రార్ధoచగా,అంబరీషుడు శ్రీ మన్నారా యణుని ధ్యానించి,"ఓ సుదర్శన చక్రమా!
 నీ కివే నా మన: పూర్వక వందనములు.

         ఈ దూర్వాసమహాముని తెలిసియో, తెలియక యో తొందరపాటుగా యీ కష్ట మును కొని తెచ్చుకొనెను.
 అయిన ను యీతడు బ్రాహ్మణుడు గాన, ఈతనిని చంపవలదు,ఒక వేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితి వేని, ముందు నన్నుచంపి,తర్వాత ఈ దుర్వాసుని జంపుము.
              నీ మన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీ మన్నారాయణుని భక్తుడను.నాకు శ్రీ మన్నారాయణుడు యిలవేల్పు, దైవము.నీవు శ్రీహరి చేతిలో నుండి అనెక యుద్ద ములలో అనేక మంది లోక కంటకులను చంపితివిగాని శరణుగోరువారి ని యింత వరకు చంపలేదు అందువలన నే యీ దుర్వాసుడుముల్లో కములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు.

            దేవా! సురా సురాది భూత కొటులన్నియు ఒక్కటి గా యేక మైన నూ నిన్నేమియు చెయ జాలవు,
 నీ శక్తికియే విధమైన అడ్డునూలేదు. ఈ విషయము లో క మంతటికి తెలియును. అయినను ముని పుంగవునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్దoచు చున్నాను.
             నీ యుందు ఆ శ్రీ మన్నారాయణుని శక్తి యిమిడి యున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును, శరణు వేడిన యీ దుర్వాసుని రక్షింపుము"అని అనేక విధ ముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు
 గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్ద నలకు శాంతించి"

             ఓ భక్త గ్రేశ్వరా ! అంబరీషా! నీభక్తీని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు.అత్యంత దుర్మార్గులు, మహా పరాక్రమవంతు లైన మధు కైటభులను- దేవతలందరు
యెక మైకూడ- చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈ లోక ములో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును

           ఇది యెల్ల రకు తెలిసిన విషేయమే, ముక్కో పియగు దుర్వాసుడు నీ పై పగ బూని నీ వ్రతమును నశింపజేసి, నానా యిక్కట్లు పెట్ట వలన ని కన్ను లెర్ర జే సి నీ మీద జూపిన రౌద్ర మును నేను తిలకించితిని. నిరపరాధ వగు నిన్ను రక్షించి, యీ ముని గర్వమణచ వలెన నితరుముచున్నాను.

          ఈతడు కూడా సామాన్యుడుగాడు.ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మ తేజస్సు గలవాడు. మహాత పశ్శాలి. రుద్ర తే జము భులో క వాసుల నందరను చంపగలదుగాని, శక్తీ లో నా కంటె యెక్కువే మియుగాదు.
 సృషి కర్త యగు బ్రాహ్మతేజస్సు కంటెను,కైలాసవ తియగు మహేశ్వరు ని తేజశ్శక్తి కంటెను యెక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతొ రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని , క్షత్రియ తేజస్సుగల నీవు గాని తులతూగరు.

          నన్నేదుర్కొన జాలరు.తనకన్న యెదుటి వాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట యుత్తమము.ఈ నీ తిని ఆచరించు వారాలు యెటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోన గలరు.
ఇంత వరకు జరిగినదంతయు విస్మరించి, శరణార్దమై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మ ము నీవు నిర్వర్తించుము"మని చక్రాయుధము పలికెను.

           అంబరీషుడా పలుకులాలకించి, " నేను దేవ గో , బ్రాహ్మణాదుల యుందును,స్త్రీలయందును, గౌరవము గలవాడను.నారాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవులేను నియేనాయభిలాష .కాన, శరణు గోరిన ఈ దుర్వాసుని, నన్నూ కరుణించి రక్షింపుము.

              వేల కొలది అగ్ని దేవతలు, కోట్ల కొలది సూర్య మండలములు యేకమైననూ నీ శక్తీకి, తేజస్సుకూ సాటి రావు.నీవు అట్టి తేజో రాశివి మహా విష్ణువు లోక నిందితుల పై, లోక కంటకుల పై, దేవ - గో - బ్రాహ్మణ హింసా పరుల పై నిన్ను ప్రయోగించి, వారిని రక్షించి,
 తనకుక్షి యుందున్న ప ధాలుగు లోక ములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు.

         కాన,నికివే నామన: పూర్వక నమస్కృతులు" అని పలికి చక్రాయుధపు పాదముల పై పడెను.అంతట సుదర్శన చక్రము అంబరీ షుని లేవదీ సి గాడాలింగన మొనర్చి " అంబరీ షా! నీ నిష్కళంక భక్తి కి మెచ్చితిని.

           విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు నెవరు పఠీ0తురో, యెవరు దాన దర్మములతో పుణ్యఫలమును వృద్దిచేసుకొందురో,యెవరు పరులను హింసించక - పర ధనములను ఆశపడక- పర స్త్రీలను చెర బెట్టిక - గో హత్య - బ్రాహ్మణహత్య- శిశు హత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టి వారి కష్ట ములు నశించి,
యిహమందున పరమందున సర్వసాఖ్యములతో తులతూగుధురు.
                కాన, నిన్నూ దుర్వాసుని రక్షించుచున్నాను,
 నీ ద్వాదశి వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్య ఫలము ముందు యీ మునిపుంగ వునిత పశ్శక్తి పని చేయలేదు ." అని చెప్పి అత ని నాశీర్వదించి, అదృశ్యా మమ్యెను.

అష్టామిశోధ్యాయము - ఇరవ య్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము.