నారికురుపులు నశించుటకు
అత్తపత్తిఆకులు మెత్తగానూరి నారికురుపులపై వేసి కట్టుకడుతూవుంటే అవి నశించిపోతయ్.
* గోంగూర, వంకాయ, మాంసం, చేపలు నిషేధం.
చల్ది, మశూచికములకు
అత్తపత్తి ఆకు 30 గ్రా॥ మిరియాలు 2 గ్రా॥ ఈ రెంటిని మెత్తగానూరి ఒక గ్రాము బరువుగల మాత్రలు చేసి గాలికి నీడలో ఎండబెట్టి నిలువచేసుకోవాలి. రెండుపూటలా ఒకమాత్ర గోరువెచ్చని నీటితో సేవిస్తూవుంటే చెల్దికురుపులు మశూచికం గండమాల హరించిపోతయ్.
* చేపలు, మాంసం, వేడిపదార్థాలు నిషేధం
వ్రణాలకు -అత్తపత్తి
అత్తపత్తిఆకులు ముద్దగా నూరి అందులో కొంచెం పసుపుకలిపి సూరి కురుపులపైన, పుండ్లపైనవేసి కట్టుకడుతూవుంటే క్రమంగా ప్రణాలు మాడిపోతయ్.
బోదకాలి మంట, పోటుకు
అత్తపత్తిఆకు 5 గ్రా॥, మిరియాలు 9 ఒకకప్పు నీటితో మెత్తగానూరి బట్టలో వడపోసి పరగడుపున 40 రోజులపాటు సేవించాలి. దీనితోపాటు
అత్తపత్తిఆకును ముద్దగా నూరి బోదకాలి పైన పట్టులాగావేసి కట్టుకడుతూవుంటే మంట, పోటు, బాధ తగ్గిపోతయ్.
*మాంసం, చేపలు, నంజుపదార్థాలు నిషేధం
కాలినగాయాలకు - కమ్మనిలేపనం
బాగాపండిన అరటిపండును మెత్తగా పిసికి కాలిన గాయాలపైన వెంటనే లేపనంచేస్తే మంట, పోటు తగ్గి గాయాలు త్వరగా మానుతయ్.
తెల్లబొల్లి మచ్చలు - తగ్గుటకు
అరటిచెట్టుదూటరసంతీసి తగినంత పసుపు కలిపి పైన లేపనం చేస్తూవుంటే తెల్లబొల్లి త్వరగా నివారించ బడుతుంది
పెద్దపెద్ద పుండ్లు - తగ్గిపోవుటకు
మెత్తటి అరటిపండ్లు వేడి అన్నం, గేదెపేడ సమంగా కలిపి మెత్తగా పిసికి పైనవేసి కట్టుకడుతూవుంటే క్రమంగా ఆపుండ్లు మానిపోతయ్.
శెగరోగములు - హరించుటకు
అరటిదుంపరసం 20గ్రా॥ పటికబెల్లంపొడి 20గ్రా॥ కలిపి రెండుపూటలా సేవిస్తూవుంటే తెల్లశెగ, ఎర్రశెగ, పచ్చశెగ తగ్గిపోతయ్.
సెగగడ్డలు - తగ్గిపోవుటకు
అవిసెగింజలు, పసుపుకొమ్ములు సమంగా తీసుకొని మెత్తగానూరి గడ్డలపైనవేసి కట్టుకడుతూ వుంటే మూడురోజులలో గడ్డలుపగిలిపోయి పుండు మాడిపోతుంది.